NTR Vardhanthi : ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పెను సంచలనం… మనుషులలో దైవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Vardhanthi at Film Nagar : నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి మోహన రూప, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ , ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి అలాగే ఎక్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ మరణం లేని మహా నాయకుడు నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది అలాగే సినీ పరిశ్రమలోనూ, రాజకీయాల్లోనూ ఎదురులేని మనిషిగా నిలబడిన వ్యక్తి. ఆయన భౌతికంగా మనకు దూరమై 28 ఏళ్లు గడిచిన ఆయన్ని ఇలా సత్కరించుకోవడం ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయం అన్నారు. నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ మరణం లేని తెలుగు జాతి గౌరవం మా నాన్న నందమూరి తారక రామారావు. భౌతికంగా మా నుండి దూరమై 28 ఏళ్లు గడిచిన మనసా – ఆలోచనల్లోనూ, వాచా – మా మాటల్లోనూ, కర్మణా – మా చేతల్లోనూ మాతోనే ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు.
Manchu Manoj: ‘హనుమాన్’తో 28 ఏళ్లకే రెండు జనరేషన్స్ కవర్ చేశావ్.. ఇరగ్గొట్టేశావ్ తమ్ముడూ !
Also Read
ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు పెను సంచలనం, సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని ఎన్టీఆర్ అనే పేరు చెరగని ముద్ర వేసుకుంది. సినిమాల్లో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. కథానాయకుడు గానే కాకుండా ప్రతి నాయకుడు పాత్రల్లో కూడా నటించి మెప్పించిన వ్యక్తి ఎన్టీఆర్ . భగవంతుడిగా ఉన్నత క్యారెక్టర్లు నటించారు డీగ్లామరైజ్డ్ రోల్ కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తిగా రాజు పేదలో నటించారు. రాజకీయాల్లోపరంగా కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని స్థాపించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ గారె ఆద్యుడు. ఆయన ఎప్పుడూ అందరివాడే. ఈరోజు అన్ని పార్టీలు కూడా ఆయన పేరుని ఆయన సంక్షేమ పథకాలను వాడుకుంటున్నాయి. ఆయన ఎప్పుడూ అజాతశత్రువే. దైవం మనుష్య రూపేణా అన్నట్టు ఎన్టీఆర్ మనుషులలో దైవం అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ , నందమూరి మోహన్ రూప , ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , ఎఫ్ ఎన్ సి సి సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి , తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ , భాస్కర్ నాయుడు మరియు కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!