యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. కొమురం భీమ్ గా ఆడియన్స్ ని మెప్పించిన ఎన్టీఆర్, ఇప్పుడు ‘దేవర’గా పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో భయానికి భయం పుట్టించే వీరుడి కథగా దేవర తెరకెక్కుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవరకి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన దేవర ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క పోస్టర్ తోనే సినిమాపైన అంచనాలు మరింత పెంచారు కొరటాల శివ అండ్ టీం. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షరా వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉంది.
ఎన్టీఆర్ ఫ్యామిలీతో షార్ట్ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్ తిరిగిచ్చాడు. మరో మూడు నాలుగు రోజుల్లో దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. దాదాపు జూన్ 7 నుంచి దేవర సెట్స్ లో ఎన్టీఆర్ మళ్లీ జాయిన్ అవ్వనున్నాడు. ఎన్టీఆర్ తో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ఒక హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు కొంత టాకీ పార్ట్ ని కూడా ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నాడు కొరటాల శివ. నవంబర్ నాటికి ఎన్టీఆర్ దేవర సినిమాలో తన పార్ట్ కాంప్లీట్ చేయనున్నాడు. అక్కడి నుంచి 2024 ఏప్రిల్ వరకూ రిలీజ్ కి గ్యాప్ ఉంది కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకోని రావడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది.