సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. టాక్ కాస్త తేడాగా ఉండడంతో త్రివిక్రమ్ మళ్లీ దెబ్బేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమాతో కంపేర్ చేస్తూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం టాక్ కాస్త అటు ఇటు అవ్వగానే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మనం సేఫ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం ప్లేస్ లో త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఉండాల్సింది. అరవింద సమేత వీరరాఘవ సినిమా చేసి హిట్ కొట్టిన వెంటనే… ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. #NTR30గా అనౌన్స్ అయిన ఈ సినిమా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సెకండ్ ప్రాజెక్ట్ అవుతుందని అంతా అనుకున్నారు.
అయిననూ పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అవుతుందనుకున్నారు కానీ మిస్ అయ్యింది. దీంతో త్రివిక్రమ్ ప్లేస్ లో కొరటాల శివ వచ్చి చేరాడు, ఇదే దేవర సినిమా అయ్యింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం మంచిదయ్యింది అనే వాళ్లు అరవింద సమేత సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ని, టార్చ్ బేరర్ అంటూ త్రివిక్రమ్ రాసిన డైలాగులని మర్చిపోయి ఉంటారు. ఒక్కసారి వెనక్కి తిరిగి 2018ని చూస్తే ఆర్ ఆర్ ఆర్ కి వెళ్లిపోయి ముందు మూడున్నర ఏళ్లు ఎన్టీఆర్ కనపడకపోయినా ఎలాంటి లోటు కనిపించని సినిమాని ఇచ్చాడు త్రివిక్రమ్. నెక్స్ట్ ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు కానీ ఎప్పుడు సెట్ అయినా కూడా సాలిడ్ సినిమాని ఆడియన్స్ కి ఇస్తారు.