NTV Telugu Site icon

NTR: మీరు ఓట్లు వేయరా.. రిపోర్టర్స్ కు సెటైర్ వేసిన ఎన్టీఆర్

Ntr

Ntr

NTR: నేడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. మరో ఐదేళ్లు తెలంగాణను ఎవరు పరిపాలించాలి అనేదాన్ని ఆలోచించి ప్రజలు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లకు వెళ్తున్నారు. ఇక తాము కూడా దేశ పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి షూటింగ్స్ ను పక్కన పెట్టి మరీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో తరాల సందడి ఎక్కువ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్ తమ కుటుంబాలతో కలిసి వచ్చి ఓటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్.. రిపోర్టర్లతో సరదాగా ముచ్చటించాడు. మొదటి నుంచి కూడా తారక్ బయట ఎంత ఫన్నీగా ఉంటాడో అందరికీ తెల్సిందే. ఎయిర్ పోర్ట్ లో కూడా ఫొటోగ్రాఫర్లు కనిపిస్తే.. మీకు ఇల్లు లేదా.. ? కుటుంబం లేదా.. ? ఎప్పుడు ఇక్కడే ఉంటారు అంటూ సెటైర్లు వేస్తూ ఉంటాడు.

Chiranjeevi: చిరుపై మరోసారి ట్రోలింగ్.. మీమ్స్ తో పిచ్చెక్కిస్తున్నారుగా

తాజాగా పోలింగ్ బూత్ లో కూడా ఎన్టీఆర్.. రిపోర్టర్లకు అలాగే సెటైర్ వేశాడు. లైన్లో నిలబడిన తారక్ ను వరుసగా ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపిస్తుంటే.. వెంటనే తారక్.. “మీరందరూ ఇక్కడే ఉంటారా? ఓట్లు వేయరా?” అని అడిగాడు. అందుకు వారు.. మీరు వెళ్ళాక వేస్తామని కొందరు, సగం మంది వేయరు అని ఇంకొందరు చెప్పుకొచ్చారు. అందుకు తారక్ సగం మంది వేయరా.. ? అని అడగ్గా.. నో సర్ అని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం తారక్.. దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.