టాలీవుడ్ కు నవంబర్ నెల ఏమాత్రం కలిసి రాలేదు. అంతకు ముందు ఫిబ్రవరి రెండో వారం నుంచి మార్చి మొదటి వారం వరకు నాన్ సీజన్గా పరిగణించేవారు. ఈ సమయంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ లేకపోవడంతో నష్టాలూ ఎదురయ్యేవి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే అదే సమయంలో విద్యార్థులు పరీక్షలు, వాటికి సంబంధించిన ప్రిపరేషన్లతో బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి సాధారణ ప్రేక్షకులు సినిమా హాళ్లకు వెళ్లేందుకు తక్కువ ఆసక్తి చూపుతారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమేనని ఈ ఏడాది విడుదలైన ‘ఉప్పెన’, ‘జాతిరత్నాలు’ చిత్రాలు నిరూపించాయి. ఈ సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు అద్బుతంగా వచ్చాయి. కాబట్టి వచ్చే ఏడాది మెగాస్టార్ ‘ఆచార్య’ ‘ఎఫ్ 3’, ‘మేజర్’ వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాలు అదే సమయంలో అంటే ఫిబ్రవరి నెలలో విడుదలకు సిద్ధం అయ్యాయి.
Read Also : చొక్కాలు చించుకుని… గోపీచంద్ మలినేని ఎమోషనల్ పోస్ట్
అయితే ఇప్పుడు నవంబర్ నెల నాన్ సీజన్ అనిపించేలా చేసింది. ఇంతకుముందు కూడా టాలీవుడ్ లో నవంబర్ నెలలో విడుదలైన చిత్రాలకు దారుణమైన స్పందన వచ్చింది. కలెక్షన్లు కూడా చాలా డల్గా ఉన్నాయి. ఈ నవంబర్లో అదే జరిగింది. దీపావళికి విడుదలైన ఏ ఒక్క చిత్రం కూడా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ను పొందలేదు. మంచి రోజులొచ్చాయి, పెద్దన్న, ఎనిమీ, పుష్పక విమానం, రాజా విక్రమార్క, కురుప్ ఇప్పటి వరకు నవంబర్ లో విడుదలైన చిత్రాలు. ఇందులో ఏ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వచ్చే వారం తక్కువ బడ్జెట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందులోనూ ఒక్క సినిమా కూడా పెద్దగా బజ్ని క్రియేట్ చేయడం లేదు.
కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి, రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ నవంబర్ చివరి వారంలో విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలపై అంచనాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ట్రేడ్ విశ్లేషకులు నవంబర్ టాలీవుడ్ కు కలిసిరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ డిసెంబర్ మొదటి వారంలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విడుదలతో బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఒకదాని తర్వాత ఒకటి పెద్ద సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.