NTV Telugu Site icon

నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘ఏక్ మినీ కథ’ హీరో!

‘తను నేను’, ‘పేపర్ బాయ్’ సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్న సంతోష్‌ శోభన్‌ రీసెంట్‌గా ‘ఏక్ మినీ కథ’తో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఈ యంగ్‌ హీరోతో దర్శకురాలు నందినీ రెడ్డి సినిమా ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం. బేబీతో హిట్‌ కొట్టిన నందినీ రెడ్డి ఆ తర్వాత ఇంతవరకు తన నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేయలేదు. అయితే నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగగా, చైతు ‘థ్యాంక్యూ’ సినిమాతో పాటుగా మరో సినిమా చర్చల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ గ్యాప్‌లో హీరో సంతోష్‌ శోభన్‌కు నందినీ కథ చెప్పినట్లు తెలుస్తోంది.