Naga Chaitanya: విజయం వైపు.. నాగచైతన్య చూపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya: అక్కినేని నటవంశం మూడోతరం హీరోగా జనం ముందు నిలచిన నాగచైతన్య అభిమానుల మదిని దోచుకున్నారు. తన ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించడానికే ఆయన తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చివచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తొలి చిత్రం ‘జోష్’ మొదలు మొన్న వచ్చిన ‘థ్యాంక్ యూ’ దాకా నాగచైతన్య కెరీర్ గ్రాఫ్ లో ప్రేమకథలే ప్రధాన పాత్ర పోషించాయి. లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్న నాగచైతన్య అప్పుడప్పుడూ భిన్నంగానూ ప్రయత్నించారు.
నాగచైతన్య 1986 నవంబర్ 23న హైదరాబాద్ లో జన్మించారు. తండ్రి వైపు మహానటవృక్షం అక్కినేని నాగేశ్వరరావుకు మనవడు, తల్లివైపున స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడుకూ మనవడే! ఇలా రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన నాగచైతన్యకు తాత ఏయన్నార్, తండ్రి నాగార్జున, మేనమామ వెంకటేశ్ లాగే నటుడవ్వాలనే అభిలాష బాల్యం నుంచీ ఉండేది. పైగా ఎటు చూసినా సినిమా వాతావరణం అలవాటవ్వడం వల్ల ఎప్పుడెప్పుడు తెరపై హీరోగా కనిపించాలన్న ఆసక్తి ఉండేది. అదే విషయాన్ని తన తొలి చిత్రం ‘జోష్’ ఆడియో వేడుకలో ఎంతో ఉత్సాహంగా చెప్పారు నాగచైతన్య. ఆ సినిమా అంత జోష్ నింపక పోయినా, రెండవ చిత్రం ‘ఏ మాయ చేశావె’ అతను కోరుకున్న విజయాన్ని అందించింది. చైతూ కెరీర్ నే కాదు, లైఫ్ నూ మలుపు తిప్పిన చిత్రంగా ‘ఏ మాయ చేశావె’ నిలచిపోయింది. అక్కినేని అభిమానులకు ఆ చిత్రం ఎనలేని ఆనందమూ పంచింది. వెంటనే సుకుమార్ దర్శకత్వంలో నటించిన ‘100 పర్సెంట్ లవ్’ కూడా నాగచైతన్యకు మరపురాని అనుభూతిని మిగిల్చింది. ఈ సినిమాల తరువాత వచ్చిన చిత్రాలు అంతగా అలరించలేదు. కానీ, తన నటజీవితంలో మరపురాని చిత్రంగా నాగచైతన్య పేర్కొన్న ‘మనం’లో తాత, తండ్రి, తమ్ముడు అఖిల్ తో కలసి చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమా ఘనవిజయం సాధించింది.
Also Read
నాగచైతన్య కెరీర్ లో “ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, మహానటి, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ” వంటి చిత్రాలు అతణ్ణి వైవిధ్యమైన పాత్రల్లో చూపించాయి. ఇప్పటికే దాదాపు ఇరవై చిత్రాలలో నటించేసిన నాగచైతన్య, ఈ నాటికీ వరైటీ రోల్స్ కే ప్రాధాన్యమిస్తూ సాగుతున్నారు. ఈ యేడాది చైతూ నటించిన మూడు చిత్రాలు జనం ముందు నిలిచాయి. తండ్రి నాగార్జునతో కలసి ‘బంగార్రాజు’లో నటించారు. ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో తెరకెక్కిన ‘లాల్ సింగ్ ఛద్దా’లోనూ నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించారు. అలాగే ‘మనం’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యూ’లోనూ చైతూ అభినయించారు. ఈ మూడు చిత్రాలు మునుపటిలా చైతూకు విజయాలను అందించలేక పోయాయి. ప్రస్తుతం ఓ సరైన సక్సెస్ కోసం నాగచైతన్య ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య ఆశలన్నీ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ సినిమాతో చైతూ ఎలాంటి సక్సెస్ చేజిక్కించుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
-
Prabhas : షాకింగ్.. ఫౌజీ vs స్పిరిట్?
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
IND vs IRE: భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ రద్దు.?
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
ట్రెండింగ్
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?