Murali Kishor: ‘లెనిన్’ సినిమాతో యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్కు సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరి. తన రెండో సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం లెనిన్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డైరెక్టర్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆయన తన నెక్స్ట్ సినిమాను కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇప్పటికే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ తరహాలోనే ఈసారి కూడా ఆయన రూరల్ బ్యాక్డ్రాప్తో కూడిన బలమైన స్టోరీని సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. గ్రామీణ నేపథ్యంతో పాటు భావోద్వేగాలు, కమర్షియల్ అంశాల మేళవింపుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్లో హీరోగా కోలీవుడ్ స్టార్ ధనుష్ అయితే బాగుంటుందనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పేరును ఈ సినిమాకు ప్రధానంగా పరిశీలిస్తున్నప్పటికీ, ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. త్వరలోనే హీరో ఎంపికపై ఫైనల్ కాల్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. హీరో, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వంటి పూర్తి వివరాలు అఫిషియల్ అనౌన్స్మెంట్ తర్వాతే వెల్లడికానున్నాయని సమాచారం.

