Megastar Chiranjeevi: మేం ఏం చేయాలో కూడా మీడియా చెప్తే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
God Father: హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా బాగా తీసిన తమ కాన్ఫిడెంట్ తగ్గించేలా మీడియాలో వస్తున్న వార్తలు చిరాకు కల్గిస్తున్నాయని అన్నారు. తామేం చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలో.. ఎప్పుడు హైలెట్ చేయాలో కూడా మీడియా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో వర్షం పడినప్పటికీ తన స్పీచ్ కొనసాగించానని, ఆపితే మీడియా వాళ్లు ఎక్కడ కంపు చేస్తారేమోననే భయంతో ఆ కార్యక్రమానికి బ్రేక్ రాకుండా చూసుకున్నానని చిరంజీవి తెలిపారు. ఈసినిమా రిలీజ్ అయిన తరువాత ప్రతి మీడియా బాగా రాసిందని.. వాళ్లకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
అటు గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయిన ఉదయం నుంచి సూపర్ అంటూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. చాలా కాలం తరువాత ఇంద్ర, ఠాగూర్.. ఆ రేంజ్ సినిమా అని ప్రతి ఒక్కరూ చెపుతున్నారని చిరంజీవి చెప్పారు. థియేటర్లకు ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేదని.. వాళ్లు ఓటీటీకి అలవాటు పడ్డారని చెపుతుంటే.. కంటెంట్ బాగుంటే వస్తారని చెప్పానని తెలిపారు. ఈ సినిమా కంటెంట్ కోసం కష్టపడి పనిచేశామని.. అందుకే ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేశారన్నారు. ముఖ్యంగా మహిళలు బాగా ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ రెమ్యునరేషన్ కోసం పని చేయలేదని.. సూపర్ హిట్ ఇవ్వాలని ప్రాణం పెట్టి పనిచేశారని చిరు కొనియాడారు. తమన్ 30 రోజులకు పైగా సరైన నిద్రపోకుండా వర్క్ చేశాడన్నారు. సత్యదేవ్ మీద తాము ఏ నమ్మకం పెట్టుకున్నామో దానికి పదింతలు నటించాడన్నారు. తన కెరీర్లో అత్యద్భుతమైన సినిమాలు 10, 15 సినిమాలు ఉంటే అందులో గాడ్ ఫాదర్ ఉంటుందన్నారు. అప్పుడు తనకు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడానికి ఎడిటర్ మోహన్ హిట్లర్ ఇచ్చారని.. ఇప్పుడు గాడ్ ఫాదర్ ఇచ్చి సక్సెస్కు కారకులు అయ్యారని చిరు అన్నారు.
Also Read
- Akkineni Nagarjuna : అఖిల్కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
- Double Occupancy OTT: పగలు అమ్మాయి.. రాత్రి అబ్బాయి.. ఓటీటీలోకి షాకింగ్ కాన్సెప్ట్ మూవీ
- Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. 'జైలర్' విలన్ వినాయకన్పై మరో కేసు
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
Read Also: Mohan Raja: స్టోరీలో మెగాస్టార్ వేలు పెడతారని అన్నవాళ్లను కొట్టేస్తా..!!
తమ మీద ప్రేమతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో నటించారని.. ఆయనకు థ్యాంక్స్ అని చెప్పారు. ఆయనకు పెద్ద అమౌంట్ ఆఫర్ చేస్తే.. చిరంజీవి, చరణ్ మీద వున్న ప్రేమను డబ్బుతో కొలుస్తావా అని మేనేజర్ను తిట్టారని చిరంజీవి వెల్లడించారు. రామ్ చరణ్ త్వరలోనే సల్మాన్కు అందుకు తగిన ప్రతిఫలం ఏదో ఒక రూపంలో తప్పకుండా ఇస్తాడన్నారు. ఎప్పుడైనా ఒక బ్రెయిన్ మీద రెండు.. రెండు మీద మూడు గొప్పవి అన్నారు. తనకు వచ్చే ప్రతి పొగడ్త పన్నీరు లాంటిది.. అది చల్లుకోవాలి కానీ తాగకూడదన్నారు. తన తదుపరి సినిమా బాబీ చేస్తున్నాడని.. ఈ మూవీలో తన పాత్ర రౌడీ అల్లుడు లాంటి మాస్గా ఉంటుందని.. తరువాత మెహర్ రమేష్ సినిమా కూడా పవర్ ఫుల్గానే ఉంటుందని చెప్పారు.
తాజావార్తలు
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
-
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
-
Akkineni Akhil : నా వల్ల సినిమా దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను!
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!