Manchu Manoj: తాండూరు ఎమ్మెల్యే అతిరుద్ర మహాయాగంలో మెరిసిన మంచు మనోజ్ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj with wife attends athirudra mahayagam at tandur: తాండూరులో అత్యంత వైభవంగా అతిరుద్ర మహాయాగం నిర్వహిస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. కన్నుల పండుగగా కొనసాగుతున్న యాగాన్ని వీక్షించేందుకు భక్తులకు రెండు కళ్లు సరిపోవడం లేదని యాగాన్ని సందర్శించిన వారు అంటున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగం సందర్శించేందుకు తాండూరు ప్రాంతంతో పాటు చుట్టుపక్కల జిల్లాల పుణ్య దంపతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు, దేవతామూర్తుల దివ్య మంగళ స్వరూపాలను చూసి మైమరచిపోతున్నారు. ఒక పక్క భజనలు, వేద పండితుల ఆశిర్వచనాలతో మహాయాగం దిగ్విజయంగా కొనసాగుతుంది. తన నివాసం వద్ద లోక కల్యాణార్థం ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చేపట్టిన శ్రీరాజశ్యామల, శతచండీ, సౌర, లక్ష్మీసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం సందర్శించేందుకు ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి సన్నిహుతులు సైతం వస్తున్నారు.
Faria Abdullah: స్త్రీ-పురుషులు ఎప్పటికీ సమానం కాదు..ఫరియా అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
ఇక ఒకేసారి రాజ్యాశ్యామల, శత చండీ, సౌర, లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగం నిర్వహించడం చరిత్రలో ఇదే మొదటిసారి అని చెబుతున్న ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు శక్తివంతమైన అన్ని యాగాలు రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా తాండూరులో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మహాయాగంలో 11 వేల మంది దంపతులు పాల్గొనడాన్ని పీఠాధిపతులు, ప్రవచన కర్తలు, జగద్గురులు అభినందిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక యాగం ముగింపు వరకు ఏదో ఒకరోజు సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, సినీరంగ ప్రముఖులు వస్తారని ముందే పైలట్ రోహిత్ రెడ్డి వెల్లడించగా ఈరోజు మంచు మనోజ్ ఆయన భార్య మంచు మౌనిక మెరిశారు. పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల మహా యాగంలో ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు (ఎమ్మెల్యే ),మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కూడా ఈ యాగాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!