లేడీ సూపర్ స్టార్ సమంతా ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఆమె ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. కేరళ అలెప్పిలోని బ్యాక్ వాటర్స్ లో చిన్న బోటులో ప్రయనిస్తున్నట్లు, అక్కడి గ్రీనరీని చూపిస్తూ ఒక వీడియోని సమంతా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకి ఖుషీ హాష్ ట్యాగ్ పెట్టడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అలేప్పీలో జరుగుతుందనే విషయం అందరికీ అర్ధం అయిపొయింది. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ నుండి కొంత విరామం తీసుకుని ఖుషీ సెట్స్లో జాయిన్ అయ్యింది సమంత. విజయ్ దేవరకొండ-సమంతా కలిసి నటిస్తున్న ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఒక ప్యూర్ లవ్ స్టొరీగా ఖుషి సినిమా ప్రమోట్ అవుతోంది. రీసెంట్ గా ఒక పోస్టర్ లాంచ్ చేసి ఖుషి సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 1న ఖుషీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Read Also: Pawan Kalyan: ఏప్రిల్ 5 నుంచి ‘భగత్ సింగ్’గా మారనున్న పవర్ స్టార్
