NTV Telugu Site icon

బట్టలు మార్చుకుంటుంటే అలా చేశారు.. నిర్మాతపై హీరోయిన్ సంచలన ఆరోపణలు

Krishna Mukherjee Accuses Producer

Krishna Mukherjee Accuses Producer

Krishna Mukherjee Accuses Producer Harassing Her: సినీ, టీవీ పరిశ్రమ అనే కాదు అన్ని రంగాల్లో కొన్ని వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తనను మేకప్ రూమ్‌లో బంధించి వేధించారని ఒక పాపులర్ టీవీ సీరియల్ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. హిందీలో ‘యే హై మొహబ్బతే’ అనే సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకున్న టీవీ నటి కృష్ణ ముఖర్జీ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రోజువారీ సీరియల్ అయిన ‘శుభ్ షగున్’ షో నిర్మాతలపై నటి తీవ్ర ఆరోపణలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ను షేర్ చేస్తూ ఆ సీరియల్ నిర్మాత తనను వేధించాడని నటి తెలిపింది. ఈ కారణంగానే ఆమె కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోందని కూడా వెల్లడించింది. మేకర్స్ తో తన అనుభవం చాలా భయంకరంగా ఉందని, దాని కారణంగా తాను నిరాశ, ఆందోళనతో పోరాడుతున్నానని ఆమె చెప్పింది. నా భావాలను వ్యక్తీకరించే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ ఇకపై దానిని నాలో ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నాను.

YSRCP: టీడీపీకి బిగ్ షాక్‌.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత

నేను చాలా కష్టమైన సమయాన్ని అనుభవిస్తున్నా, ‘నేను ఒంటరిగా ఉన్నప్పుడు కలత చెందా. నేను దంగల్ టీవీ కోసం నా చివరి షో శుభ్ షాగున్ చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ఇది నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం అని ఆమె పేర్కొంది. ప్రొడక్షన్‌ హౌస్‌, నిర్మాత కుందన్‌సింగ్‌ నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టారు, నేను అనారోగ్యంతో ఉన్నా. అప్పుడే నన్ను మేకప్ రూమ్‌లో బంధించారు. వాళ్ళు నా మేకప్ రూమ్ తలుపు కొట్టారు అది కూడా నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు, పగలగొడతారేమో అనిపించింది. నాకు ఫీజు కూడా వచ్చేది కాదు. అందుకే షూటింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. బెదిరింపుల కారణంగా ఏమీ మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. దీనికి భయపడి ఇప్పుడు వేరే ప్రాజెక్ట్‌లు చేయడం మానేశా. ఐదు నెలలుగా జీతం ఇవ్వడం లేదని నటి చెప్పింది. ప్రొడక్షన్ హౌస్ అలాగే దంగల్ ఛానెల్‌కి కూడా వెళ్ళాను కానీ ఎటువంటి స్పందన రాలేదు. చాలా మంది నుండి సహాయం కోరా కానీ ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేకపోయారని కూడా ఆమె చెప్పింది.