Site icon NTV Telugu

Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’పై కార్తికేయ కామెంట్స్

Valimai

భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న “వలీమై” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో విలన్ గా నటించిన తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ఒకరోజు ముందుగానే ‘వలీమై” వస్తోందని, 24న వలీమై, 25న భీమ్లా నాయక్, 26 నుంచి రెండు సినిమాలనూ చూడాలని కోరారు. అలాగే టాలీవుడ్ లో పవన్ కు ఎంత క్రేజ్ ఉందో, కోలీవుడ్ లో అజిత్ కు కూడా అంత క్రేజ్ ఉందంటూ చెప్పుకొచ్చారు కార్తికేయ.

Read Also : Janhvi Kapoor in NTR 31 : క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయిక.

https://www.youtube.com/watch?v=v97rAjyN_hQ
Exit mobile version