‘ఆంధ్రావాలా’ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించిన తారక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారు తారక్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నట్టు వెల్లడైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా పలు బిటౌన్ పాపులర్ షోలలో పాల్గొన్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ప్రముఖ హిందీ కామెడీ టాక్ షో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్న ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ ‘ఆంధ్రావాలా’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
తన 2004 చిత్రం ఆంధ్రావాలా ఆడియో లాంచ్కు సుమారు 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని తెలిపారు. పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, దాని పర్యవసానంగా దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేయడం వల్ల ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తమ చిత్రం విడుదల వాయిదా పడినట్లు ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాతలు ఇటీవల ప్రకటించారు. అయితే దీనికి ముందు చిత్రనిర్మాత రాజమౌళితో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ఈ కల్పిత పీరియాడికల్ డ్రామాను బాగా ప్రమోట్ చేశారు. అదే కారణంతో వారు కపిల్ శర్మ షో వేదికపై కూడా కన్పించారు. ఈ ఎపిసోడ్ నిన్న రాత్రి టెలివిజన్లో ప్రసారమైంది.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
Read Also : పిక్ : మాల్దీవుల్లో మెర్మైడ్… మెస్మరైజ్ చేస్తున్న దిశా
ఈ షో ఇంటరాక్షన్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్లకు భారీ సంఖ్యలో అభిమానులు ఎలా వస్తారో హోస్ట్ కపిల్ శర్మ ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ 2004 చిత్రం ‘ఆంధ్రావాలా’ ఆడియో లాంచ్కు వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఎలా చేసిందో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అభిమానుల సంఖ్య గురించి తారక్ ని అడిగినప్పుడు, సినిమా ఆడియో లాంచ్కు దాదాపు 9 నుండి 10 లక్షల మంది అభిమానులు వచ్చారని, దాని కోసం ప్రభుత్వం 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర విషయాన్నీ వెల్లడించారు. దీని గురించి తెలుసుకున్న అలియా భట్ అవాక్కయ్యారు.
2004లో వచ్చిన “ఆంధ్రావాలా” చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. జూనియర్ ఎన్టీఆర్, రక్షిత, సాయాజీ షిండే, రాహుల్ దేవ్ కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..