బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ కారణంగానే జాన్వీ కపూర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహంలో గోల్డెన్ డ్రస్లో తళుక్కుమని మెరిసింది. సహచర తారాగానంతో ఆడిపాడింది. ఇంతలోనే ఆమె అస్వస్థతకు గురికావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
జాన్వీ కపూర్కు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ముంబై ఆస్పత్రిలో చేరినట్లు ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం జాన్వీ కోలుకుంటుందని చెప్పారు. కొద్దిరోజుల్లోనే ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.