Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ

Tollywood (1)

Tollywood (1)

మోహన్ లాల్ మలయాళ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ దృశ్యం తెలుగులో రీమేక్ అయ్యి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సిరీస్ లో భాగంగా పార్ట్ 3 తీసుకువస్తున్నాడు మోహన్ లాల్. ఈ నెల 21న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. కానీ ఈసారి దృశ్యం 3 తెలుగులో రీమేక్ కావడం లేదు. విక్టరీ వెంకటేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో మోహన్‌లాల్ నటించిన ఒరిజినల్ మలయాళ వెర్షన్‌నే తెలుగులోకి డబ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్లు సిద్ధమవుతున్నాయి.

ఈ చిత్రం మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలో మరియు ఓవర్సీస్ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమాకు లభిస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరోసారి జార్జ్ కుట్టి మ్యాజిక్ రిపీట్ కాబోతున్నట్లు స్పష్టమవుతోంది. తెలుగు మరియు ఇతర భాషల ట్రైలర్లు, విడుదల తేదీల గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మలయాళ వెర్షన్ విడుదలయ్యే మే 21నే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మొదటి రెండు భాగాలు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో వెంకటేష్ లేకపోయినప్పటికీ మోహన్‌లాల్ వెర్షన్‌కు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.