Itlu Maredumilli Prajaneekam Teaser: మరో ‘నాంది’ని చూపించబోతున్న అల్లరి నరేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లరి నరేష్.. తన మొదటి మార్చేసుకున్న ఈ హీరో కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతల పాలిట వరంగా మారిన నరేష్ ప్రస్తుతం తన పంథా మార్చుకున్నాడు. రొట్ట కామెడీకి స్వస్తి పలికి కథకు ప్రాధాన్యం, సమాజంలో జరుగుతున్నా అన్యాయాలను తన సినిమాలో చూపిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో తన కొత్త జీవితానికి నాంది పలికిన నరేష్.. అదే దర్శకుడు తో మరో ‘నాంది’కి తెరలేపాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రాల్లో నరేష్ సరసన తెలుగమ్మాయి ఆనంది నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి నరేష్ కు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “ఇవన్నీ ట్రైబుల్ విలేజెస్.. వీళ్లల్లో ఎక్కువమంది జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేయనివారే ఉన్నారు” అన్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రాల్లో నరేష్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కడో మారుమూల ఉన్న ఒక ప్రాంతానికి తన అసిస్టెంట్స్ తో వెళ్లిన నరేష్.. వారికి ఓటు విలువ చెప్పి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయమని అడగడానికి వెళ్తాడు. అయితే ఆ ప్రాంతంలో ఉండే జనాలు దానికి అంగీకరించరు. మరి ఆ జనాలకు, రాజకీయ నేతలకు మధ్య నరేష్ ఎలా బలయ్యాడు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ జనాల సమస్యలు ఏంటి..? వాటి కోసం నరేష్ పోరాటం చేశాడా..? జనాల కోసం నరేష్ నిలబడి, రాజకీయ నేతలకు తలనొప్పిగా మారాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొత్తం మారేడుమిల్లి ప్రాంతంలోనే షూట్ చేసినట్లు కనిపిస్తోంది.
Also Read
- Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
- God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
- Sunil Narang: 'ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి' ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
- Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ట్రైబుల్ విలేజ్ అమ్మాయిగా ఆనంది కనిపించింది. చివర్లో “పాతిక కిలోమీటర్లు ఇవతలకు వస్తే కానీ వీళ్లు ఇలా బతుకుతున్నారు అని మనకి కూడా తెలియలేదు.. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో, జాలి పడాలో కూడా తెలియట్లేదు మాస్టారు” అంటూ నరేష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆలోచింపజేస్తోంది. మొత్తానికి టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్ మరో నాంది ని చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నరేష్ ఇంకో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?