Itlu Maredumilli Prajaneekam Teaser: మరో ‘నాంది’ని చూపించబోతున్న అల్లరి నరేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లరి నరేష్.. తన మొదటి మార్చేసుకున్న ఈ హీరో కామెడీ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. ఒకప్పుడు మినిమం గ్యారెంటీ హీరోగా నిర్మాతల పాలిట వరంగా మారిన నరేష్ ప్రస్తుతం తన పంథా మార్చుకున్నాడు. రొట్ట కామెడీకి స్వస్తి పలికి కథకు ప్రాధాన్యం, సమాజంలో జరుగుతున్నా అన్యాయాలను తన సినిమాలో చూపిస్తూ విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పటికే నాంది చిత్రంతో తన కొత్త జీవితానికి నాంది పలికిన నరేష్.. అదే దర్శకుడు తో మరో ‘నాంది’కి తెరలేపాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రాల్లో నరేష్ సరసన తెలుగమ్మాయి ఆనంది నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా నేడు నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి నరేష్ కు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. “ఇవన్నీ ట్రైబుల్ విలేజెస్.. వీళ్లల్లో ఎక్కువమంది జీవితంలో ఒక్కసారి కూడా ఓటు వేయనివారే ఉన్నారు” అన్న డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఈ చిత్రాల్లో నరేష్ ఎన్నికల అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఎక్కడో మారుమూల ఉన్న ఒక ప్రాంతానికి తన అసిస్టెంట్స్ తో వెళ్లిన నరేష్.. వారికి ఓటు విలువ చెప్పి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయమని అడగడానికి వెళ్తాడు. అయితే ఆ ప్రాంతంలో ఉండే జనాలు దానికి అంగీకరించరు. మరి ఆ జనాలకు, రాజకీయ నేతలకు మధ్య నరేష్ ఎలా బలయ్యాడు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ జనాల సమస్యలు ఏంటి..? వాటి కోసం నరేష్ పోరాటం చేశాడా..? జనాల కోసం నరేష్ నిలబడి, రాజకీయ నేతలకు తలనొప్పిగా మారాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా మొత్తం మారేడుమిల్లి ప్రాంతంలోనే షూట్ చేసినట్లు కనిపిస్తోంది.
Also Read
- Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
- The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న 'ది ఇండియా స్టోరీ' టీజర్
- Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రైబుల్ విలేజ్ అమ్మాయిగా ఆనంది కనిపించింది. చివర్లో “పాతిక కిలోమీటర్లు ఇవతలకు వస్తే కానీ వీళ్లు ఇలా బతుకుతున్నారు అని మనకి కూడా తెలియలేదు.. వీళ్ళని చూస్తుంటే బాధపడాలో, జాలి పడాలో కూడా తెలియట్లేదు మాస్టారు” అంటూ నరేష్ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ ఆలోచింపజేస్తోంది. మొత్తానికి టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్ మరో నాంది ని చూపించబోతున్నట్లు అర్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నరేష్ ఇంకో హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.
తాజావార్తలు
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!