Karthikeya -2: సీక్వెల్ పై భారీ అంచనాలు ఏర్పడటం సహజం: చందు మొండేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కార్తికేయ’ సినిమాతో దర్శకుడిగా మారిన చందు మొండేటి… ఆ తర్వాత ‘ప్రేమమ్’, సవ్యసాచి’ చిత్రాలను రూపొందించాడు. అయితే మొదటి రెండు సినిమాలు సాధించిన విజయాన్ని ‘సవ్యసాచి’ పొందలేకపోయింది. తాజాగా ఇప్పుడు ‘కార్తికేయ -2’తో మరోసారి తన అదృష్టాన్ని చందు మొండేటి పరీక్షించుకోబోతున్నాడు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఈ సినిమా అనేక పర్యాయాలు వాయిదా పడినా, ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లకపోవడానికి ప్రధాన కారణంగా ఇది ‘కార్తికేయ’ ఫ్రాంచైజ్ కావడంతో పాటు… తాము ఎంచుకున్న కథ’ అని చందు తెలిపాడు. కృష్ణ తత్త్వాన్ని, ద్వారక నగరానికి సంబంధించిన అంశాలను ఈ సినిమా ద్వారా తెలియచేస్తుండటంతో ప్రేక్షకులలో ఆ ఆసక్తి అలానే ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు. ఈ మూవీ గురించి మాట్లాడుతూ, ”కర్మ సిద్ధాంతాన్ని ఇందులో చూపించాం. దైవత్వంలో సైన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ‘కార్తికేయ’ మూవీలోని హీరో క్యారెక్టరైజేషన్ ఈ సీక్వెల్ లోనూ రన్ అవుతుంది. అందులో మాదిరిగానే ఇందులోనూ ఓ అడ్వంచర్ కు హీరో సిద్ధపడతాడు. అందువల్ల ‘కార్తికేయ’ను చూడని వారికి కూడా ఈ సినిమా అర్థమౌతుంది. సో… సహజంగానే ఈ మూవీతో జనాలు కనెక్ట్ అవుతారు” అనే ధీమాను వ్యక్తం చేశాడు.
Also Read
సినిమా మెయిన్ థీమ్ ను వివరిస్తూ, ”శ్రీ కృష్ణుడు లేడని వాదించే వారు ఇప్పుడూ కొందరు ఉన్నారు. కానీ ఆయన ఉన్నాడన్నది వాస్తవం. దాన్ని చెప్పే చిరు ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. దేవుడు అనేది ఓ ఫెయిత్. దాని వల్ల కొంత డిసిప్లిన్ మనకు అలవాటు అవుతుంది. ఆ నమ్మకంలో ఓ పాజిటివిటీ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ కథను తెరకెక్కించాం. నిజానికి ఇవాళ మనం చాలా విషయాలను మూఢ నమ్మకాలుగా కొట్టి పడేస్తుంటాం. కానీ ఆ కాలం నాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అవి సమాజానికి ఎంతో ఉపయోగపడినవే! ఇవాళ కొన్ని ఇర్రిలవెంట్ కావచ్చు. అందువల్ల కామన్ సెన్స్ తో ఆలోచించి, మూఢత్వానికి పోకుండా, మన ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. అదే ఈ సినిమాలో చూపించాం” అని చెప్పారు.
నిఖిల్ పాత్ర గురించి చెబుతూ, ”’కార్తికేయ’లో మెడికల్ స్టూడెంట్ గా నటించిన నిఖిల్… ఇందులో డాక్టర్ గా నటించాడు. దాంతో అతని ఆలోచనా విధానం మరింత మెచ్యూరిటీతో ఉంటుంది. అలానే అనుపమ్ ఖేర్ ను కూడా అవసరం మేరకే తీసుకున్నాం. ఆయన ఉండే పది నిమిషాల సీన్స్ మూవీకి చాలా కీలకం. సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ఆయన పాత్ర గురించి మాట్లాడతారు. దీనిని హిందీలోనూ రిలీజ్ చేయాలని అనుకున్నాం కాబట్టి…. ఉత్తరాదికి తెలిసిన వారు ఆ పాత్ర చేస్తే బాగుంటుందనే అనుపమ్ ఖేర్ ను ఎంపిక చేసుకున్నాం” అని అన్నారు.

”పిల్లలు ‘కార్తికేయ-2’ మూవీని చూస్తే, మన చరిత్రను తెలుసుకునే ఆస్కారం ఉంటుందని, ఐదు నుండి పదిహేనేళ్ళ వారికి ఇది చాలా బాగా నచ్చుతుందని, వాళ్లు ఎంత ఎక్కువ మంది థియేటర్ కు వచ్చి ఈ మూవీని చూస్తే తాను అంత ఆనందిస్తాన’ని చందు మొండేటి తెలిపారు. తన తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని అన్నారు.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?