NTV Telugu Site icon

Guntur Kaaram: కుర్చీని మడతబెట్టి.. ఫుల్ సాంగ్ వచ్చేసింది.. చూశారా ..?

Sreel

Sreel

Guntur Kaaram:అతడు, ఖలేజా తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక మహేష్ ఊర మాస్ లుక్, శ్రీలీల అందాలు.. మీనాక్షి చౌదరి .. ఇలా ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొనేలా చేశాయి. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కానుంది. తిప్పి తిప్పి కొడితే ఇంకా 10 రోజులు కూడా లేదు సంక్రాంతికి.. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. కానీ, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదన్నట్లు.. మహేష్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయినా ట్రెండ్ సెట్ చేయడంలో మాత్రం లేటెస్ట్ అని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది.

ఇక తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కుర్చీని మడతబెట్టి అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయినదగ్గరనుంచి సోషల్ మీడియా షేక్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక కొద్దిసేపటి క్రితమే ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. థమన్ మ్యూజిక్, మహేష్, శ్రీలీల స్టెప్స్ నెక్స్ట్ లెవెల్.. రామజోగయ్య ఆడించిన లిరిక్స్, సాహితి, శ్రీ కృష్ణ వాయిస్ బావుంది. ట్రోలింగ్ పక్కన పెడితే.. మంచి జోష్ ఉన్న సాంగ్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.