Shah Rukh Khan : బిగ్ రిలీఫ్… ‘రయీస్’ కేసులో కోర్టు తీర్పు ఇదే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. వడోదర రైల్వే స్టేషన్లో 2017లో జరిగిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని ఆలకించారు జస్టిస్ నిఖిల్ కరీల్. అప్పట్లో షారుఖ్ పై దాఖలైన ఈ క్రిమినల్ కేసును గుజరాత్ హైకోర్టు ఏప్రిల్ 27 బుధవారం నాడు రద్దు చేసింది. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి ఖాన్పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. షారుఖ్ ఖాన్ జనాలను ఉత్తేజపరచడానికే ఆలా చేసి ఉండొచ్చు. అంతేకానీ అది నిర్లక్ష్యంతో చేసిన పని కాదు. షారుఖ్ తన సినిమా ప్రమోషన్ గురించే అలా చేశాడు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అర్థమవుతోంది అంటూ న్యాయమూర్తి స్టార్ హీరోకు అనుగుణంగా తుది తీర్పును ఇచ్చారు.
Read Also : RGV : అజయ్ దేవ్గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
2017 జనవరి 23న షారుఖ్ తన సినిమా ‘రయీస్’ ప్రచారానికి వడోదర వచ్చారు. అక్కడ ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొనడంతో, జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే స్థానిక రాజకీయ నాయకుడు ఈ తొక్కిసలాట సందర్భంగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దీంతో జితేంద్ర సోలంకి అనే వ్యక్తి షారుఖ్ పై ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించడానికి, సూపర్ స్టార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వడోదర కోర్టును ఆశ్రయించారు. సోలంకి తన ఫిర్యాదులో షారుఖ్ అభిమానులను ఉత్సాహపరచడానికి స్మైలీ బాల్స్ ను విసరడం, టీషర్ట్స్ విసరడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించారు. అదే ఈ తొక్కిసలాటకు, అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైందని అన్నారు. కానీ తాజాగా ఈ కేసును కోర్టు కొట్టేసింది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!