Shah Rukh Khan : బిగ్ రిలీఫ్… ‘రయీస్’ కేసులో కోర్టు తీర్పు ఇదే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. వడోదర రైల్వే స్టేషన్లో 2017లో జరిగిన ‘రయీస్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఓ వ్యక్తి మరణించడంతో మృతుడి కుటుంబ సభ్యులు షారూఖ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు. తనపై ఉన్న క్రిమినల్ కేసును, దిగువ కోర్టు తనపై జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ షారుఖ్ ఖాన్ చేసిన విజ్ఞప్తిని ఆలకించారు జస్టిస్ నిఖిల్ కరీల్. అప్పట్లో షారుఖ్ పై దాఖలైన ఈ క్రిమినల్ కేసును గుజరాత్ హైకోర్టు ఏప్రిల్ 27 బుధవారం నాడు రద్దు చేసింది. ఈ ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తి ఖాన్పై ఫిర్యాదు చేశారని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. షారుఖ్ ఖాన్ జనాలను ఉత్తేజపరచడానికే ఆలా చేసి ఉండొచ్చు. అంతేకానీ అది నిర్లక్ష్యంతో చేసిన పని కాదు. షారుఖ్ తన సినిమా ప్రమోషన్ గురించే అలా చేశాడు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదని అర్థమవుతోంది అంటూ న్యాయమూర్తి స్టార్ హీరోకు అనుగుణంగా తుది తీర్పును ఇచ్చారు.
Read Also : RGV : అజయ్ దేవ్గన్ వర్సెస్ కిచ్చా సుదీప్… వర్మ షాకింగ్ కామెంట్స్
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
2017 జనవరి 23న షారుఖ్ తన సినిమా ‘రయీస్’ ప్రచారానికి వడోదర వచ్చారు. అక్కడ ఆయనను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొనడంతో, జనాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఫర్హీద్ ఖాన్ పఠాన్ అనే స్థానిక రాజకీయ నాయకుడు ఈ తొక్కిసలాట సందర్భంగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడ్డారు. దీంతో జితేంద్ర సోలంకి అనే వ్యక్తి షారుఖ్ పై ఫిర్యాదును దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించడానికి, సూపర్ స్టార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో షారుఖ్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వడోదర కోర్టును ఆశ్రయించారు. సోలంకి తన ఫిర్యాదులో షారుఖ్ అభిమానులను ఉత్సాహపరచడానికి స్మైలీ బాల్స్ ను విసరడం, టీషర్ట్స్ విసరడం నేరపూరిత నిర్లక్ష్యమని ఆరోపించారు. అదే ఈ తొక్కిసలాటకు, అందులో ఒకరి ప్రాణాలు పోవడానికి కారణమైందని అన్నారు. కానీ తాజాగా ఈ కేసును కోర్టు కొట్టేసింది.
తాజావార్తలు
-
Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
-
India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!