Murali Mohan : మురళీమోహన్ కి ఘన సన్మానం.. ‘నటసింహ చక్రవర్తి’ బిరుదు ప్రధానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Felicitation to Murali Mohan by VB Entertainments: విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ 2023 వేడుక ఘనంగా జరిగింది. ఈ క్రమంలో డా. ఎం. మురళీమోహన్ గారికి సన్మానం జరిగింది. ఈ వేడుకలో మురళీమోహన్ మాట్లాడుతూ విష్ణు బొప్పన ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి చేతుల మీదుగా నాకు ఈ సన్మానం జరగడం చాలా ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. ఆయన ఎంతో బిజీగా ఉండి కూడా ఈవెంట్ వచ్చి నా సన్మానానికి హాజరై ఇలా ఆశీస్సులు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్న మురళీ మోహన్ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా, ఈ విబి ఎంటర్టైన్మెంట్స్ వెండితెర అవార్డ్స్ ఫంక్షన్ ఇలా పదో వార్షికోత్సవం విజయవంతంగా జరుపుకోవడం ఈ ఫంక్షన్ లో నన్ను సన్మానించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. విష్ణు బొప్పన అలాగే అవార్డ్స్ ఫంక్షన్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నా 50 సంవత్సరాల నట జీవితాన్ని పురస్కరించుకుని ‘నటసింహ చక్రవర్తి’ బిరుదు ఇవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
Prashant Neel: కార్పొరేట్ బుకింగ్స్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
- Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
- Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న 'లెనిన్'.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
- Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
తెలుగు సినీ ఇండస్ట్రీలో అవార్డులు వాళ్ళు చేసిన కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అవార్డులు అందిస్తోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి నంది అవార్డులకున్న విశిష్టత మనకు తెలుసు, కానీ తెలుగు రాష్ట్రాలు రెండు విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డుల గురించి పట్టించుకోవడమే మానేశాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వ హయాంలో మళ్లీ అది మొదలు పెట్టాలని ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అవార్డులను ఇవ్వాలి అలానే ఇకనుంచి ప్రతి సంవత్సరం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా జరిగేలా మీ ప్రభుత్వం చూడాలి అని విజ్ఞప్తి చేసుకుంటున్నానన్నారు. మురళీమోహన్ గారు చేసిన విజ్ఞప్తికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ మురళీమోహన్ చెప్పిన అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళు అందరం ఒకటే, గత కొన్ని సంవత్సరాలుగా ఇవ్వాల్సి ఉన్న అవార్డులు అన్నిటినీ కూడా కచ్చితంగా ఇచ్చే విధంగా మా గవర్నమెంట్ చేస్తుంది అని స్పందించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..