సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్ లో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అజిత్ “విశ్వాసం” రీమేక్ కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మనీష్ షా ఇప్పుడు సినిమా నిర్మాణంలోకి అడుగు పెడుతున్నాడు. అజిత్ కుమార్ నటించిన ‘విశ్వాసం’ రీమేక్ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతోంది. అయితే ‘విశ్వాసం’లో అజిత్ కుమార్ పోషించిన పాత్రను అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఇద్దరూ తిరస్కరించారని తెలుస్తోంది. ‘విశ్వాసం’ ప్రధాన భాగం హిందీ ప్రేక్షకుల సెన్సిబిలిటీకి సరిపోదని సూపర్ స్టార్స్ భావించినట్లు తెలుస్తోంది.
Read Also : “అన్స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
రీమేక్ రైట్స్ నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం. తమిళంలో శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘విశ్వాసం’ హిందీ రీమేక్కు సహ నిర్మాతగా బాలాజీ టెలిఫిల్మ్స్ను మనీష్ షా సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇద్దరు పెద్ద సూపర్స్టార్లు ఈ ప్రాజెక్ట్ను తిరస్కరించడం గమనార్హం. 2019లో శివ ఈ ప్రాజెక్ట్ ను షారూఖ్ ఖాన్ కు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే జీరోతో భారీ పరాజయాన్ని చవిచూడడంతో అతను దానిని తిరస్కరించాడు.
మనీష్ షా మీడియాతో మాట్లాడుతూ తాను ప్రాజెక్ట్ గురించి చర్చించానని, అది పట్టాలెక్కడానికి సమయం పడుతుందని చెప్పాడు. 2019 సంక్రాంతికి విడుదలైన విశ్వాసం బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో నయనతార, అజిత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. జగపతిబాబు మెయిన్ విలన్గా నటించాడు.