Vijay Deverakonda: దేవరకొండ సినిమాతో తమిళ్ స్టార్ హీరో వారసుడు టాలీవుడ్ ఎంట్రీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Vikram Cameo in Vijay Deverakonda Goutham Tinnanuri Film: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్లో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ లేదు. శ్రీ లీల నటించబోతున్నారని అధికారికంగా ప్రకటించారు కానీ ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో రష్మిక మందన నటించిన బోతున్నారని ఒకసారి, ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ వస్తున్నాయి. కానీ పూర్తి సమాచారం అయితే లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా ద్వారా ఒక తమిళ స్టార్ హీరో కొడుకు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరో కాదు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్.
Vishwak Sen: కమల్ హాసన్, శివ కార్తికేయన్ బాటలో విశ్వక్ సేన్!
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
ఇక్కడ సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో రీమేక్ చేస్తే అందులో హీరోగా నటించాడు ధృవ్. ఆ తర్వాత తండ్రితో కలిసి మహాన్ అనే సినిమా చేశాడు కానీ అది ఓటీటీలో రిలీజ్ అయింది. ప్రస్తుతానికి మరో సినిమా చేసే హడావుడిలో ఉన్నాడు కానీ తెలుగులో విజయ్ దేవరకొండ, గౌతమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. తమిళ్ లో కూడా రిలీజ్ చేయడానికి అనుకూలంగా ఆయనను తీసుకున్నారని ప్రచారం ఉంది. ఇక విజయ్ దేవరకొండ 12వ సినిమాకు సంబంధించిన షూటింగ్ మార్చి రెండో వారం నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్నారు. నిజానికి సినిమా పూజా కార్యక్రమంతో మొదలుపెట్టిన సమయంలో విజయ్ దేవరకొండ, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారని ప్రకటించారు అయితే ఈ సినిమా నుంచి శ్రీ లీల తప్పుకుంటున్నట్టు ప్రచారం అయితే ఉంది.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!