సరికొత్త ఫాంటసీ కామెడీ చిత్రం ముస్తాబవుతోంది. ప్రముఖ నటి యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నయ్యి నవెల్లి’. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ వినోదాత్మక చిత్రం అక్టోబర్ 16, 2026న దేశవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల కానుంది. మీరట్ నగరంలోని ఒక ఉమ్మడి కుటుంబంలోకి కొత్తగా పెళ్లైన కోడలు అడుగుపెడుతుంది.
ఎంతో పద్ధతిగా, పర్ఫెక్ట్గా కనిపించే ఆ కొత్త వదినపై ఆమె మరిదికి వింత అనుమానం వస్తుంది. ఆమె నిజానికి ఒక ‘మాంత్రికురాలు’ ఏమోనని భావించడంతో మొదలయ్యే సరదా గందరగోళం, నవ్వుల విందు చుట్టూ ఈ కథ నడుస్తుంది. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ ఈ చిత్రానికి సరికొత్త కథను అందించగా.. బ్లాక్బస్టర్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత బాధ్యతలు చేపట్టారు. నవ్వులు, ఫాంటసీ, పండుగ వాతావరణంతో థియేటర్లలో సరికొత్త అనుభూతిని పంచేందుకు వస్తున్న ‘నయ్యి నవెల్లి’ దసరా బరిలో అక్టోబర్ 16న అలరించడానికి సిద్ధమవుతోంది.

