NTV Telugu Site icon

SSMB29 : మహేష్, రాజమౌళి మూవీ గురించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్..

Vijayendra Prasad

Vijayendra Prasad

SSMB29 : సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తరువాత మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రస్తుతం ఆ సినిమా కోసం తన లుక్ ను చేంజ్ చేసే పని లో వున్నాడు.ఇప్పటికే లాంగ్ హెయిర్ ,గుబురు గడ్డంతో ఎంతో స్టైలిష్ గా కనిపించిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి.ఫుడ్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా వుండే మహేష్ ఇప్పుడు రాజమౌళి మూవీ కోసం బరువు పెరిగే ప్రయత్నం చేస్తున్నారట.దానికోసం ఫుడ్ లాగించేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాను రాజమౌళి ఆఫ్రికన్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

Read Also :Gangs Of Godavari : మరి కొన్ని గంటల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ..

ఈ సినిమాను రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు..అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.అయితే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు.కానీ ఆ రోజు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.దీనితో ఈ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో రాజమౌళి తండ్రి మరియు ఈ సినిమా కథా రచయిత అయిన విజయేంద్రప్రసాద్ తెలిపారు.ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ చేయిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.సెట్ వర్క్స్ మొత్తం పూర్తి అయిన తరువాత ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.అలాగే ఈ సినిమా అఫీసియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాతే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని ఆయన తెలిపారు .ఇదంతా జరగడానికి మరో రెండు సమయం పెట్టొచ్చని ఆయన తెలిపారు.