‘బలగం’ సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న కమెడియన్ వేణు, తన తదుపరి చిత్రంగా ‘యల్లమ్మ’ను ప్రకటించి రెండు మూడేళ్లు అవుతున్నా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని నటిస్తాడని ప్రచారం జరిగింది. ఆయన నో చెప్పడంతో నితిన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ.. చివరకు అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ను హీరోగా ప్రకటిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేసి షాక్ ఇచ్చారు.
హీరో విషయంలో ఒక స్పష్టత వచ్చినా, హీరోయిన్ ఎంపిక మాత్రం మేకర్స్కు పెద్ద సవాలుగా మారింది. మొదట సాయి పల్లవి, ఆ తర్వాత కీర్తి సురేశ్ వంటి స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించినా ఎవరూ ఫైనల్ కాలేదు. తాజాగా ఈ రేసులోకి మృణాల్ ఠాకూర్ పేరు వచ్చి చేరింది. తెలుగులో ఇప్పటికే ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్, గత నెలలో విడుదలైన ‘డెకాయిట్’లోనూ తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ప్రస్తుతం మృణాల్ పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకే మొగ్గు చూపుతుండటంతో, వేణు రాసుకున్న ‘యల్లమ్మ’ కథకు ఆమె అయితే సరిగ్గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది, మృణాల్ ఎంపికపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది చూడాల్సి ఉంది.
