యోగేష్ కల్లె హీరోగా, సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “త్రిముఖ”. అకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, మొట్టా రాజేంద్రన్, ఆశు రెడ్డి, సాహితీ దాసరి, ప్రవీణ్, షకలక శంకర్, సుమన్, రవి ప్రకాష్, జీవా, సమ్మెట గాంధీ, జెమినీ సురేశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అఖిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీదేవి మద్దాలి, రమేష్ మద్దాలి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రాజేష్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించిన ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రానున్న “త్రిముఖ” సినిమాని ఈ నెల 30న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు “త్రిముఖ” సినిమా డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజేశ్ నాయుడు మాట్లాడుతూ ఒక మంచి కథతో, బలమైన స్క్రీన్ ప్లే తో “త్రిముఖ” చిత్రాన్ని రూపొందించాను. మూవీ ఫస్టాఫ్ అంతా ఎంటర్ టైన్ చేస్తుంది. సెకండాఫ్ తల పక్కకు తిప్పనంతగా ఎంగేజింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమాలోని ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి పాత్ర ఒక మంచి విషయాన్ని తెలియజేస్తుంది. రొటీన్ సినిమాలకు తప్పకుండా భిన్నంగా ఉండేలా ప్రయత్నించాం. యోగేష్ కు నటుడిగా పేరు తెచ్చే మూవీ అవుతుంది. సన్నీ లియోన్ గారిని ఇప్పటిదాకా గ్లామర్ యాంగిల్ లోనే చూశారు. ఆమెలోనూ ఒక నటి ఉంటుంది. ఆమె నటిగా పర్ ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సన్నీ లియోన్ గారిని తీసుకున్నాం. ప్రవీణ్, జెమినీ సురేష్ క్యారెక్టర్స్ ఆకట్టుకుంటాయి. ప్రవీణ్ ఎంతో సపోర్ట్ చేశారు. జెమినీ సురేష్ చిన్న క్యారెక్టరైనా ఇంపాక్ట్ తెచ్చేలా నటించారు. సాహితీ క్యారెక్టర్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ నెల 30న రిలీజ్ కు వస్తున్న “త్రిముఖ” చిత్రాన్ని ఆదరించాలి రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.
