NTV Telugu Site icon

Tollywood : సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి మృతి

Jm

Jm

సినీ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (85) మృతి చెందారు. వయోభారంతో మూడు రోజుల క్రితం అస్వస్థ తకు గురైన ఆయన శనివారం రాత్రి స్వగ్రామమైన బాపట్ల జిల్లా కారంచేడులో తుదిశ్వాస వి డిచారు. రాధాకృష్ణమూర్తి పలు
చలన చిత్రాలను నిర్మించారు. ‘ఒక దీపం, వియ్యాలవారి కయ్యాలు, శ్రీ వినాయక విజయం, కోడళ్లు వస్తున్నారు. జాగ్రత్త, కోరుకున్న మొగుడు, ప్రతిబింబాలు’ లాంటి పలు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. రాధాకృష్ణ మూర్తి భార్య శాంతమ్మ మూడేళ్ల క్రితం మరణించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాధాకృష్ణమూర్తి మృతి పట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు కారంచేడులో నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరావు తో జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన ప్రతిబింబాలు మూవీ 1982 లో విడుదల కావలసి ఉన్న అప్పట్లో కొన్ని కారణాల రీత్యా విడుదల కాలేదు. అయిన సరే ఆ సినిమాను రిలీజ్ చేయాలనే పట్టుదలతో సుమారు నలభై ఏళ్ల తర్వాత అక్కినేని జయంతి సందర్భంగా ప్రతిబింబాలు సినిమాను రిలీజ్ చేసి తన చిరకాల కోరిక తీర్చుకున్నారు జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి.