NTV Telugu Site icon

Tollywood : దిల్ రాజు సినిమాను వెనక్కు నెట్టిన మైత్రి మూవీస్.

Untitled Design (36)

Untitled Design (36)

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మైత్రి మూవీస్, దిల్ రాజు svc సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా, వైజయంతి మూవీస్ రెగ్యులర్ గా సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు. పైకి అంతా బాగానే ఉన్న లోలోపల పోటీ గట్టిగా ఉంటుంది. తమ సినిమా ముందుగా రావాలంటే తమదే రావాలని పంతాలకు వెళ్లడం, తమ సినిమా రిలీజ్ ఉంటే పక్కవారి సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఉండడం అదంతా ఒక రకమైన రాజకీయం.

కాగా టాలీవుడ్ లొని రెండు టాప్ సంస్థలు ఒకే హీరోతో వేరు వేరుగా సినిమాలు  చేయబోతున్నాయి. రెండు అధికారకంగా ప్రకటనలు కూడా ఇచ్చాయి. అవి మరేవో కాదు ప్రస్తుతం నం .1 ప్రొడక్షన్ హౌస్ గా దూసుకువెళుతున్న మైత్రి మూవీస్, మరోటి ఎప్పటి నుండో చిత్రసీమలో కొనసాగుతూ థియేటర్ల రాజ్యాన్ని శాసించే దిల్ రాజు svc సినిమాస్. ఈ  రెండు  సంస్థలు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో చేయబోయే సినిమాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎవరి సినిమా ముందు ఎవరి సినిమా వెనక అనే తకరారు నడించింది.

ఈ నేపథ్యంలో ముందుగా మైత్రి మూవీస్ సినిమా మొదలెట్టనున్నాడు దేవరకొండ. గతంలో విజయ్ దేవరకొండ తో ‘టాక్సీవాలా’ వంటి హిట్ చిత్రాన్నీ తెరకెక్కించిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ రెండవ సారి  విజయ్ తో పనిచేయబోతున్నాడు. ఇక దిల్ రాజు నిర్మించే చిత్రానికి రాజావారు రాణివారు చిత్రనికి డైరెక్ట్ చేసిన రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ నటించనున్నాడు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. శ్రీలంకలో షూటింగ్ చేస్తున్న ఈ చిత్రం నుండి విజయ్ లుక్ ఫోటో లీక్  కావడం అవి నెట్టింట వైరల్ గా మారడం చకచకా జరిగాయి.

Also  Read: Raviteja : మిస్టర్ బచ్చన్ OTT రైట్స్ డీల్ క్లోజ్..!