Telugu Film Chamber Of Commerce: అత్యవసర సమావేశం.. అందుకేనా..?
తెలుగు నిర్మాతల మండలి నేడు మరోసారి సమావేశం కాబోతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు సినీ నిర్మాతల కౌన్సిల్ లెటర్తో పాటు ఓటీటీ, వీపీఎఫ్ ఛార్జీలు, టిక్కెట్ల ధరలు, ప్రొడక్షన్ కాస్ట్ పై చర్చించనున్నట్లు సమాచారం. అలానే రేపు (26వ) తేదీ మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తన నాలుగు విభాగాల నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్, స్టూడియో నిర్వాహకులుతో సమావేశం కానుంది. ఆ సమావేశంలోని అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, ఓ నిర్ణయానికి రాబోతోంది. అప్పటి వరకూ నిర్మాతలంతా సహనంతో ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, షూటింగ్స్ ను, సినిమా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చని నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.
read also: Draupadi Murmu : దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా
Also Read
- Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలుగు సినిమా తీవ్ర సంక్షోభంలో ఉంది. స్టార్ హీరోల సినిమాలకు సైతం ఆదరణ లభించని పరిస్థితి నెలకొంది. కొవిడ్ అనంతరం కొన్ని సినిమాలకు మాత్రమే ప్రేక్షకాదరణ లభించింది. చాలా సినిమాలకు థియేటర్లలో స్పందన కరువు అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ను ఆపివేసి ఓసారి పరిస్థితులను పునః సమీక్షించుకోవడం మంచిదని రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే, కరోనా కష్టాలను అధిగమించి ఇప్పుడిప్పుడే సినిమా రంగం గాడిన పడుతున్న సమయంలో ఇలా షూటింగ్స్ బంద్ చేస్తే అసలుకే ఎసరు పెట్టినట్టు అవుతుందని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతల మండలి నేడు మరోసారి సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలోని అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి, ఓ నిర్ణయానికి రాబోతోంది. అప్పటి వరకూ నిర్మాతలంతా సహనంతో ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, షూటింగ్స్ ను, సినిమా కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించవచ్చని నిర్మాతల మండలి కార్యదర్శులు ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో తెలిపారు.
అవార్డు విజేతలకు అభినందనలు
68వ జాతీయ సినీ అవార్డులలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ‘కలర్ ఫోటో’, ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్, నృత్య దర్శకురాలిగా సంధ్యారాజ్, ఉత్తమ మేకప్ మ్యాన్ గా టి.వి. రాంబాబు ఎంపికైన విషయం తెలిసిందే. వీరందరికీ తెలుగు నిర్మాతల మండలి అభినందనలు తెలియచేసింది. అలానే ఉత్తమ నటుడిగా ఎంపికైన సూర్యకు, ఆయన నటించి నిర్మించిన ‘సూరారై పోట్రు’ బృందానికి, ఇతర అవార్డుల విజేతలకు శుభాభినందనలు తెలిపింది.
Telangana Politics : ఆ నాయకుడి రాజకీయ భవిష్యత్ పై క్లారిటీ వచ్చినట్టేనా..?
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!