Akhanda 2 : తొలగిన అడ్డంకులు.. తెలంగాణ జీవో వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన ‘అఖండ-2’ సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మెమో (సంఖ్య: 6593-P/General.A1/2025; తేది: 10-12-2025) ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిబంధనలు/మార్గదర్శకాలను సడలించి ఈ పెంపుదలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ టిక్కెట్ ధరల పెంపు డిసెంబర్ 12, 2025 నుండి డిసెంబర్ 14, 2025 వరకు (మొత్తం మూడు రోజులు) వర్తిస్తుంది.
Also Read :Bhartha Mahasayulaku Wignyapthi : అద్దం ముందు రవితేజ ‘విజ్ఞప్తి’!
Also Read
- Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- CM Vijay: IMDb లిస్ట్ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి 'దళపతి'! అసలేం జరిగిందంటే..
- Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
- iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
* సింగిల్ స్క్రీన్లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా ₹ 50/- (GST తో సహా) పెంచడానికి అనుమతి లభించింది.
* మల్టీప్లెక్స్లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా ₹ 100/- (GST తో సహా) పెంచడానికి అనుమతి ఇచ్చారు.
* ప్రత్యేక షో: డిసెంబర్ 11, 2025 న రాత్రి 8.00 గంటలకు వేసే ఒక షోకి టిక్కెట్ ధర *₹ 600/-*గా (GST తో సహా) నిర్ణయించబడింది.
Also Read :Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?
ఈ ఉత్తర్వులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ పెంచిన ధరల ద్వారా థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయంలో 20% (ఇరవై శాతం) మొత్తాన్ని తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి. ఈ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్కు జమ చేయబడుతుంది. ఈ నిధి నిర్వహణ కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ద్వారా, కార్మిక కమిషనర్తో సంప్రదించి ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి ఏపీ నుంచి జీవో జారీ అయ్యాక కూడా తెలంగాణ నుంచి జీవో జారీ కాకపోవడంతో తెలంగాణ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు జీవో జారీ అవుతుందో అని ఆసక్తికరమైన ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ జీవో జారీ అయింది. మరి కొద్ది సేపట్లో తెలంగాణ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
-
Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ రష్యా టూర్ రద్దు.. కారణమిదేనా!
-
CSK Vs SRH: సీఎస్కే జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్.. SRH ప్లే ఆఫ్ ఆశలు గల్లంతేనా..?
-
Anand Mahindra: మనుషులకు ప్రకృతి నేర్పే ‘డెడ్లీ’ లెసన్.. బిలియనీర్ చెప్పిన పవర్ఫుల్ మెసేజ్!
-
PM Modi: పొదుపు మంత్రం ఆచరణ.. సగానికి సగం తగ్గిపోయిన మోడీ కాన్వాయ్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!