Akhanda 2 : తొలగిన అడ్డంకులు.. తెలంగాణ జీవో వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ తాండవం అనే సినిమా రూపొందింది. ఈ సినిమా ఇప్పటికే డిసెంబర్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనూహ్య కారణాలతో వాయిదా పడింది. ఇక ఇప్పుడు డిసెంబర్ 12వ తేదీన ‘అఖండ-2’ సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో టిక్కెట్ ధరల పెంపునకు తాత్కాలికంగా అనుమతి మంజూరు చేసింది. హోమ్ డిపార్ట్మెంట్ జారీ చేసిన మెమో (సంఖ్య: 6593-P/General.A1/2025; తేది: 10-12-2025) ద్వారా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. నిబంధనలు/మార్గదర్శకాలను సడలించి ఈ పెంపుదలకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ టిక్కెట్ ధరల పెంపు డిసెంబర్ 12, 2025 నుండి డిసెంబర్ 14, 2025 వరకు (మొత్తం మూడు రోజులు) వర్తిస్తుంది.
Also Read :Bhartha Mahasayulaku Wignyapthi : అద్దం ముందు రవితేజ ‘విజ్ఞప్తి’!
Also Read
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
* సింగిల్ స్క్రీన్లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా ₹ 50/- (GST తో సహా) పెంచడానికి అనుమతి లభించింది.
* మల్టీప్లెక్స్లు: ప్రస్తుత టిక్కెట్ ధరపై అదనంగా ₹ 100/- (GST తో సహా) పెంచడానికి అనుమతి ఇచ్చారు.
* ప్రత్యేక షో: డిసెంబర్ 11, 2025 న రాత్రి 8.00 గంటలకు వేసే ఒక షోకి టిక్కెట్ ధర *₹ 600/-*గా (GST తో సహా) నిర్ణయించబడింది.
Also Read :Akhanda 2: మళ్లీ ఆందోళనలో బాలయ్య అభిమానులు.. అఖండ 2 ఉంటుందా? లేదా?
ఈ ఉత్తర్వులో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ పెంచిన ధరల ద్వారా థియేటర్లకు వచ్చే అదనపు ఆదాయంలో 20% (ఇరవై శాతం) మొత్తాన్ని తప్పనిసరిగా సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలి. ఈ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్కు జమ చేయబడుతుంది. ఈ నిధి నిర్వహణ కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ద్వారా, కార్మిక కమిషనర్తో సంప్రదించి ఒక ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి ఏపీ నుంచి జీవో జారీ అయ్యాక కూడా తెలంగాణ నుంచి జీవో జారీ కాకపోవడంతో తెలంగాణ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడు జీవో జారీ అవుతుందో అని ఆసక్తికరమైన ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ జీవో జారీ అయింది. మరి కొద్ది సేపట్లో తెలంగాణ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!