Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సైలెంట్గా సాగిన థియేటర్ల నిర్వహణ వ్యవహారం.. ఇప్పుడు కలెక్షన్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి రచ్చకెక్కింది. మల్టీప్లెక్స్ల హవా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమ మనుగడ కోసం ఒక కీలకమైన డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అదే “పర్సంటేజ్ సిస్టమ్”. ప్రస్తుతం నడుస్తున్న సాంప్రదాయ రెంట్ విధానం వల్ల తాము దారుణంగా నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లలో వాటా కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు గళమెత్తారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఇంతలా పట్టుబట్టడానికి కారణం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆదాయ పంపకాల వ్యత్యాసాలే. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ₹1 కోటి రూపాయల గ్రాస్ వసూలు సాధించిందని అనుకుంటే.. ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింగిల్ స్క్రీన్ (ఫిక్స్డ్ రెంట్ విధానం)లో ₹7 లక్షలు అద్దె మాత్రమే వారికి ఉంటుంది. మిగిలిన ₹93 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి.
Also Read
- Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Chennai Love Story: అమెరికాలోనూ 'చెన్నై లవ్ స్టోరీ' జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి కిరణ్ అబ్బవరం సినిమా
- The Paradise: నాని 'ది ప్యారడైజ్'లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
మల్టీప్లెక్స్ ల పర్సంటేజ్ విధానం ప్రకరం ₹45 లక్షలు మల్టీప్లెక్స్ ఉంచుకుని ₹55 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి. ఈ గణాంకాలను గమనిస్తే అసలు వ్యత్యాసం అర్థమవుతుంది. ఒకే రకమైన బిజినెస్ జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్స్ యజమానులకు భారీగా లాభాలు దక్కుతుంటే.. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులకు మాత్రం కేవలం నామమాత్రపు ఫిక్స్డ్ రెంట్లు మాత్రమే మిగులుతున్నాయి. సినిమా సూపర్హిట్ అయి కోట్లు కురిపించినా, సింగిల్ స్క్రీన్ ఓనర్కు వచ్చే అద్దె రూపాయి కూడా పెరగదు. అదే సినిమా ఫ్లాప్ అయితే, కనీస నిర్వహణ ఖర్చులు (కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు) కూడా రాక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ వివక్షకు స్వస్తి పలికి, సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడానికి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఒక సరైన పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అదే 60:40 రేషియో.ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. థియేటర్కు వచ్చే కలెక్షన్ల షేర్లో 60% వాటా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, మిగిలిన 40% వాటా థియేటర్ యజమానికి దక్కుతుంది. అయితే ఇప్పటికిప్పుడు అలా చేసేందుకు చాలా పెద్ద సినిమాల నిర్మాతలు సిద్దంగా లేరు.
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్లోకి కిరణ్ అబ్బవరం సినిమా
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?