Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సైలెంట్గా సాగిన థియేటర్ల నిర్వహణ వ్యవహారం.. ఇప్పుడు కలెక్షన్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి రచ్చకెక్కింది. మల్టీప్లెక్స్ల హవా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమ మనుగడ కోసం ఒక కీలకమైన డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అదే “పర్సంటేజ్ సిస్టమ్”. ప్రస్తుతం నడుస్తున్న సాంప్రదాయ రెంట్ విధానం వల్ల తాము దారుణంగా నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లలో వాటా కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు గళమెత్తారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఇంతలా పట్టుబట్టడానికి కారణం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆదాయ పంపకాల వ్యత్యాసాలే. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ₹1 కోటి రూపాయల గ్రాస్ వసూలు సాధించిందని అనుకుంటే.. ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింగిల్ స్క్రీన్ (ఫిక్స్డ్ రెంట్ విధానం)లో ₹7 లక్షలు అద్దె మాత్రమే వారికి ఉంటుంది. మిగిలిన ₹93 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి.
Also Read
- Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
- Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
- NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
- NBKxKoratalaSiva : పుకార్లు సృష్టిస్తే దబిడి దిబిడే.. బాలయ్య - కొరటాల శివ సినిమాపై టీమ్ క్లారిటీ
మల్టీప్లెక్స్ ల పర్సంటేజ్ విధానం ప్రకరం ₹45 లక్షలు మల్టీప్లెక్స్ ఉంచుకుని ₹55 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి. ఈ గణాంకాలను గమనిస్తే అసలు వ్యత్యాసం అర్థమవుతుంది. ఒకే రకమైన బిజినెస్ జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్స్ యజమానులకు భారీగా లాభాలు దక్కుతుంటే.. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులకు మాత్రం కేవలం నామమాత్రపు ఫిక్స్డ్ రెంట్లు మాత్రమే మిగులుతున్నాయి. సినిమా సూపర్హిట్ అయి కోట్లు కురిపించినా, సింగిల్ స్క్రీన్ ఓనర్కు వచ్చే అద్దె రూపాయి కూడా పెరగదు. అదే సినిమా ఫ్లాప్ అయితే, కనీస నిర్వహణ ఖర్చులు (కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు) కూడా రాక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ వివక్షకు స్వస్తి పలికి, సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడానికి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఒక సరైన పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అదే 60:40 రేషియో.ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. థియేటర్కు వచ్చే కలెక్షన్ల షేర్లో 60% వాటా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, మిగిలిన 40% వాటా థియేటర్ యజమానికి దక్కుతుంది. అయితే ఇప్పటికిప్పుడు అలా చేసేందుకు చాలా పెద్ద సినిమాల నిర్మాతలు సిద్దంగా లేరు.
తాజావార్తలు
-
Votes Cancelled: రాజధానిలో 43 లక్షల ఓట్లు గల్లంతు.. మీ ఓటు ఉందా..? లేదా..? తెలుసుకోండిలా..
-
Anaswara : టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరోయిన్
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!