Single Screen vs Multiplex: టాలీవుడ్లో పర్సంటేజ్ షేర్ ఎలా ఉంటుందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సైలెంట్గా సాగిన థియేటర్ల నిర్వహణ వ్యవహారం.. ఇప్పుడు కలెక్షన్ల పంపకాల దగ్గరికి వచ్చేసరికి రచ్చకెక్కింది. మల్టీప్లెక్స్ల హవా పెరిగిపోతున్న ఈ రోజుల్లో, నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమ మనుగడ కోసం ఒక కీలకమైన డిమాండ్ను తెరపైకి తెచ్చారు. అదే “పర్సంటేజ్ సిస్టమ్”. ప్రస్తుతం నడుస్తున్న సాంప్రదాయ రెంట్ విధానం వల్ల తాము దారుణంగా నష్టపోతున్నామని, మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లలో వాటా కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్లు గళమెత్తారు.
సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు ఇంతలా పట్టుబట్టడానికి కారణం.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆదాయ పంపకాల వ్యత్యాసాలే. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ₹1 కోటి రూపాయల గ్రాస్ వసూలు సాధించిందని అనుకుంటే.. ప్రస్తుత లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం. సింగిల్ స్క్రీన్ (ఫిక్స్డ్ రెంట్ విధానం)లో ₹7 లక్షలు అద్దె మాత్రమే వారికి ఉంటుంది. మిగిలిన ₹93 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి.
Also Read
- Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? 'ఇరుముడి'పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
- AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్పై రౌడీ హీరో కన్ను!
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
మల్టీప్లెక్స్ ల పర్సంటేజ్ విధానం ప్రకరం ₹45 లక్షలు మల్టీప్లెక్స్ ఉంచుకుని ₹55 లక్షలు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా నిర్మాతలకు వెళతాయి. ఈ గణాంకాలను గమనిస్తే అసలు వ్యత్యాసం అర్థమవుతుంది. ఒకే రకమైన బిజినెస్ జరుగుతున్నప్పుడు, మల్టీప్లెక్స్ యజమానులకు భారీగా లాభాలు దక్కుతుంటే.. సింగిల్ స్క్రీన్ నిర్వాహకులకు మాత్రం కేవలం నామమాత్రపు ఫిక్స్డ్ రెంట్లు మాత్రమే మిగులుతున్నాయి. సినిమా సూపర్హిట్ అయి కోట్లు కురిపించినా, సింగిల్ స్క్రీన్ ఓనర్కు వచ్చే అద్దె రూపాయి కూడా పెరగదు. అదే సినిమా ఫ్లాప్ అయితే, కనీస నిర్వహణ ఖర్చులు (కరెంట్ బిల్లులు, స్టాఫ్ శాలరీలు) కూడా రాక థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ వివక్షకు స్వస్తి పలికి, సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడానికి ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఒక సరైన పరిష్కారాన్ని ప్రతిపాదించింది. అదే 60:40 రేషియో.ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. థియేటర్కు వచ్చే కలెక్షన్ల షేర్లో 60% వాటా నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుంది, మిగిలిన 40% వాటా థియేటర్ యజమానికి దక్కుతుంది. అయితే ఇప్పటికిప్పుడు అలా చేసేందుకు చాలా పెద్ద సినిమాల నిర్మాతలు సిద్దంగా లేరు.
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
-
Supreme Court: టెట్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
-
Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? ‘ఇరుముడి’పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
-
Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!