Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సినిమా థియేటర్ల వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో, ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారనీ తెలుస్తోంది. రెంటల్ విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, దాని స్థానంలో పర్సంటేజీ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ మే 1 నుంచి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ల తాకిడి, ఓటీటీల ప్రభావంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణ భారంగా మారిందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ సింగిల్ స్క్రీన్లు రెంటల్’ లేదా ‘ఫిక్స్డ్ అమౌంట్’ ప్రాతిపదికన నడుస్తున్నాయి. అంటే సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా థియేటర్ యజమాని డిస్ట్రిబ్యూటర్లకు ఒక నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే, థియేటర్ యజమాని చెప్పిన అమౌంట్ కట్టేసినా కలెక్షన్స్ లేక సొంత జేబు నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే మల్టీప్లెక్స్లలో ‘పర్సంటేజీ’ (షేర్) విధానం అమలవుతోంది. అంటే వచ్చిన వసూళ్లలో థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ ఒక ఒప్పందం ప్రకారం వాటాలను పంచుకుంటారు. ఇదే విధానాన్ని సింగిల్ స్క్రీన్లలోనూ అమలు చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజీ విధానంతో పాటు సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదు అనేలా ఓటీటీ విండో విధిస్తే అప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని వారు భావిస్తున్నారు. అలానే టికెట్ ధరల నియంత్రణ, విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ సహా పన్నుల విషయంలో ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. ఈ నెల (ఏప్రిల్) 30 లోగా దీనిపై స్పష్టమైన నిర్ణయం రాకపోతే, మే 1 నుంచి తెలంగాణలోని సుమారు 450కి పైగా ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ హెచ్చరించింది. వేసవి సెలవుల సమయంలో పలు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ‘బంద్’ నిర్ణయం చిత్ర పరిశ్రమకు పెద్ద షాక్ అనే చెప్పాలి.
Also Read
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
- OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!