సుకుమార్ భార్యకు ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్రోల్ చేస్తున్నారు. కాగా తాజాగా సుకుమార్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ భార్య తబిత ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలు చేపట్టింది. సుకుమార్ సహచరుడు, ‘సుకుమార్ రైటింగ్స్’ బాధ్యతలను నిర్వహించే ప్రసాద్ అనే వ్యక్తి మార్చి 28న గుండెపోటు కారణంగా కన్నుమూశారు. దీంతో ఇప్పుడు ఆ బాధ్యతలను సుకుమార్ తన భార్యకు అప్పగించారు. ఇప్పటి నుంచి సుకుమార్ గైడెన్స్ లో ఆమె ఈ బ్యానర్ ను నడిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ 2014 లో స్థాపించబడింది. తన బ్యానర్లో కుమారి 21 ఎఫ్ (2015) చిత్రంతో సుకుమార్ చిత్ర నిర్మాతగా మారారు. అతను దర్శకుడు, 100% కాదల్, ఉప్పెన వంటి చిత్రాలకు మద్దతు ఇచ్చాడు. ప్రస్తుతం తన బ్యానర్ లో నిఖిల్ హీరోగా నటించిన “18 పేజెస్” ను నిర్మిస్తున్నారు సుకుమార్.
Also Read
తాజావార్తలు
-
DA Hike: విద్యుత్ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Off The Record: సత్యవేడు టీడీపీలో ఆల్ సెట్ అయినట్టేనా..?
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
India-UK: జూలై 15 నుంచి స్వేచ్ఛా వాణిజ్య అమలు.. ఏవేవి తగ్గనున్నాయంటే..!
ట్రెండింగ్
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!