తమిళ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందనలను అందుకున్న ఈ మూవీలో సూర్య పర్ఫార్మెన్స్కు అభిమానులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
Also Read : Janhvi kapoor : మెట్ గాలా వేదికపై భారతీయ ప్రతిభను చూసి గర్వపడండి..
తెలుగులో గత వారం అంతా కూడా నాని హిట్ 3 సందడే కనిపించింది. హిట్ 3 జోరులో అసలు ‘రెట్రో’ మూవీనే కనిపించలేదు. అందుకే వసూళ్లు ఏమీ రాలేదని సమాచారం. కానీ తమిళ్ లో ఈ మూవీకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. రీసెంట్గా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్లో చేరిందని మూవీ యూనిట్ ప్రకటించింది. విడుదలైన 7 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరడం పట్ల సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మూవీ ద్వారా వచ్చిన లాభాల్లో నుంచి సూర్య తాజాగా రూ..10 కోట్లు అగరం ఫౌండేషన్కు విరాళం అందించాడు. ఈ సందర్భంగా రెట్రో చిత్ర యూనిట్ కూడా సూర్య వెంట ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.