సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా టైటిట్ రిలీజ్ ఈవెంట్ కు కేవలం ఐదు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 15న ఈ సినిమా టైటిల్ తో పాటు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో కనివిని ఎరుగని రీతిలో ఈవెంట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ LED స్క్రీన్స్ ను ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : JSJ : డైరెక్టర్ గా విజయ్ కొడుకు జాసన్ సంజయ్.. టైటిల్ పోస్టర్ రీలీజ్
కాగా ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ కొనుగోలు చేయగా తమ ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ చేసేలా డీల్ సెట్ చేసింది హాట్ స్టార్. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ కు మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి. ప్రియాంక చోప్రా, పృద్విరాజ్ సుకుమారన్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతటి భారీ ఈవెంట్ కు ఇతర మీడియా సంస్థల కెమెరాలు ఉపయోగించకుండా ఆదేశాలు ఇచ్చింది హాట్ స్టార్. మీడియా ప్రతినిదులను అనుమతిస్తూ వారికీ సంబంధించి కెమెరాలను అనుమతి నిరాకరించింది. మరోవైపు ఈ ఈవెంట్ ఎంట్రీ పాస్ ల కోసం భారీ డిమాండ్ ఏర్పండింది. ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న GlobeTrotter ఈవెంట్ కు సుమారు లక్ష మంది అభిమానులు హాజరవుతారని అంచనా. ఈ SSMB 29కు ‘వారణాసి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట రాజమౌళి.
