Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ కమ్ నిర్మాతల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. గత కొంతకాలంగా అంతర్గతంగా సాగుతున్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు బహిరంగంగా ఒక్కసారిగా పేలింది. ఈ వివాదం ప్రధానంగా రెండు గ్రూపులుగా విడిపోయిన నిర్మాతలు, మరియు సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్వహణపై నడుస్తోంది. తాజాగా జరిగిన పరిణామాలతో శిరీష్, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు వంటి ప్రముఖులు ఒక పక్షాన ఉండగా.. నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి వంటి వారు మరో పక్షాన నిలిచారు.
ఈ గొడవకు ప్రధాన కారణం థియేటర్ల రెంట్ మరియు పర్సంటేజ్ విధానం. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ‘పర్సంటేజ్’ విధానం కావాలని డిమాండ్ చేస్తుండగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాత్రం ‘రెంటల్’ విధానాన్నే సమర్థిస్తోంది. నైజాం ఏరియాలో గత నెల రోజులుగా సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజ్ విధానం అమలవుతోంది. అయితే ఈ గొడవ కారణంగా ఇటీవలే విడుదలైన ‘జెట్లీ’ సినిమా సింగిల్ స్క్రీన్లలో ప్రదర్శనకు నోచుకోలేకపోయింది. జూన్ 4న చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది. ఈ భారీ చిత్రం రిలీజ్కు ముందు సింగిల్ స్క్రీన్ల సమస్య తలెత్తడం చిత్ర యూనిట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ సింగిల్ స్క్రీన్లలో ఈ సినిమా ప్రదర్శించకపోతే ఓపెనింగ్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. నాగవంశీ చెప్పినట్టు ఈ వివాదాన్ని చిరంజీవి వరకు తీసుకువెళ్తే పెద్ది ఇష్యూ వరకు సాల్వ్ చేస్తారా లేదా ఇండస్ట్రీ పెద్దగా ముందుకు వచ్చి రెండు గ్రూపులను కూర్చోబెట్టి అసలు సమస్యను పరిష్కరిస్తారాఅన్నది చూడాలి.
Also Read
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!