టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘భోగి’ విడుదల తేదీ ఖరారు కావడంతో, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ మొదలైంది. ఈ చిత్రం ఆగస్టు 28న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ తేదీ శర్వానంద్కు ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, దీనికి అటు ఇటుగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి.
Also Read : AJITH KUMAR : డైరెక్టర్స్ని రిపీట్ చేస్తోన్న అజిత్.. ఫ్లాప్ దర్శకుడికి మరో ఛాన్స్
శర్వానంద్ సినిమా విడుదల కావడానికి వారం ముందే, అంటే ఆగస్టు 21న నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదల కానుంది. నాని ఫామ్లో ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘భోగి’ విడుదలైన రెండు వారాల తర్వాత, సెప్టెంబర్ 11న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రణబలి’తో థియేటర్లలోకి రానున్నారు.
ఒకవైపు నాని ‘క్లాస్ + మాస్’ హైప్, మరోవైపు విజయ్ దేవరకొండ క్రేజ్ మధ్యలో ‘భోగి’ బిగ్ ఫైట్ ని ఎదురుకోవాల్సి ఉంటుంది. నాని సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే రెండో వారంలో కూడా అది స్ట్రాంగ్గా ఉంటుంది. మరోవైపు విజయ్ సినిమా కోసం అప్పటికే ప్రమోషన్లు పీక్స్లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘భోగి’ టీమ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే చాలా విభిన్నమైన, పవర్ఫుల్ కథతో సాలిడ్ టాక్ రాబట్టాల్సి ఉంటుంది. విభిన్నమైన కథాంశాలతో వచ్చే శర్వానంద్, ఈసారి ‘భోగి’తో ఆ ఇద్దరు స్టార్ల పోటీని తట్టుకుని ఏ మేరకు బాక్సాఫీస్ వద్ద నిలబడతారో చూడాలి. ఈ ముగ్గురు యంగ్ హీరోల మధ్య జరగబోయే ఈ బాక్సాఫీస్ వార్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.