NTV Telugu Site icon

SanjayDutt : సంజయ్ దత్ పని కానిచ్చేసిన పూరి జగన్నాధ్..!

Untitled Design (40)

Untitled Design (40)

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ల బ్లాక్‌బస్టర్ ఇస్మార్ట్ శంకర్. ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే కాంబినేషన్‌లో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్‌. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సంజయ్ దత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులను పూర్తి చేసాడు, ఈ మేరకు అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రస్తుతం షూటింగ్ ముగించి నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా పూర్తి కావస్తుండగా, ప్రమోషన్స్ లో వేగం పెంచింది ఇస్మార్ట్ టీమ్. ఇటీవల విడుదలైన రెండు పాటలు మరియు టీజర్‌కు భారీ స్పందన లభించింది. ముఖ్యంగా మార్ ముంత చోర్ చింత మాస్ అడియన్స్ లో అద్భుతమైన రెస్పాన్స్‌ దక్కించుకుంది.ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్స్ మొదటి భాగం కంటే డబుల్ డోస్ ఉంటుందని తెలుస్తోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ డబుల్ ఇస్మార్ట్ కు సంగీతం అందించారు. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన నిరంజన్ రెడ్డి ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ తెలుగు రాష్ట్రాలకు 56 కోట్లకు, హిందీ 6కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారు. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంతో స్ట్రాంగ్ కమ్ ఇవ్వాలని అటు పూరి, ఇటు రామ్ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Bellamkonda: జెట్ స్పీడ్ లో బెల్లం కొండ..మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..