ప్రముఖ సినీ నేపథ్య గాయని, లెజెండరీ ఎస్. జానకి కన్నుమూసినట్లుగా ఆమె మనవరాలు అప్సర సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన గానంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాదిమంది హృదయాలను అలరించిన గాన కోకిల ఎస్. జానకి శనివారం కన్నుమూసినట్లు ఆమె పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆమె కన్నుమూసినట్లు జానకమ్మ మనవరాలు అప్సర ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు.
“మా గ్రాండ్ మదర్, లెజెండరీ సింగర్ ఎస్. జానకి ఇక లేరనే నిజాన్ని ఎంతో భారమైన హృదయంతో పంచుకుంటున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమ, అనుబంధం మధ్య ఆమె ప్రశాంతంగా అనంత లోకాలకు వెళ్లిపోయారు. మా హృదయాలు ఈరోజు ఎంతో బరువెక్కినప్పటికీ ఆమె జీవించిన అద్భుతమైన జీవితానికి, ఆమె అందించిన పాటల ద్వారా ఎన్నో కోట్ల మందికి ఆమె పంచిన ఆనందానికి మేము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం” అని పేర్కొన్నారు.
ఆమె ఈ ప్రపంచానికి తన పాటలతో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు అందించిన ఒక ఐకానిక్ వాయిస్, కానీ ఆ కుటుంబానికి మాత్రం ఆమె ఎంతో ఆప్యాయత కలిగిన మా గ్రాండ్ మదర్. ఆమె చూపించిన ప్రేమ, దయాగుణం, ఉన్నతనం మా గుండెల్లో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి అంటూ జానకమ్మను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ కఠిన సమయంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు.

