భారతీయ చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని రీతిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ విజువల్ వండర్ ‘రామాయణం’ (Ramayana). ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో, బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ ఎపిక్ డ్రామా ఏకంగా 10,000 మందికి పైగా క్రూ (Crew) సభ్యులతో ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. భారతీయ సంస్కృతిని, పురాణేతిహాసాన్ని గ్లోబల్ ఆడియన్స్కు హాలీవుడ్ ప్రమాణాలతో చూపించడమే లక్ష్యంగా ఈ సినిమాను రెండు భాగాలుగా (Part 1 & Part 2) ప్లాన్ చేశార
దర్శకుడు నితీష్ తివారీ పక్కా రీసెర్చ్తో, స్క్రిప్ట్ వర్క్ కే ఏళ్ల సమయం కేటాయించి ఈ ప్రాజెక్ట్ను సెట్స్పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ చిత్రం ఇండియాలోని భారీ సెట్స్తో పాటు విదేశాల్లోని పలు కీలక లొకేషన్లలో సరికొత్త వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో షూటింగ్ జరుపుకుంటోంది. విదేశీ నిపుణులు ఈ విజువల్ ఎఫెక్ట్స్ పనులను పర్యవేక్షిస్తున్నారు. కన్నడ సూపర్స్టార్ యష్ ఈ సినిమాలో లంకేశ్వరుడి (రావణుడు) గా నటిస్తూనే.. ఈ చిత్రానికి సహ నిర్మాతగా (Co-Producer) వ్యవహరిస్తూ ప్రాజెక్ట్ రేంజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్న ఈ విజువల్ ఎపిక్ కోసం యావత్ ప్రపంచ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
