Ramayana Glimpse: ‘రామా’ గ్లింప్స్కు ముహూర్తం ఫిక్స్.. రాముడిగా రణబీర్ కపూర్ దర్శనం!
- భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రామాయణ’
- రాముడి పాత్రలో నటిస్తున్న రణ్బీర్ కపూర్
- ‘రామా’ గ్లింప్స్కు ముహూర్తం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor’s Ramayana Glimpse Date Locked: భారతీయ సినీ చరిత్రలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా ‘రామాయణ’. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రామాయణకు నమిత్ మల్హోత్రా నిర్మాత కాగా.. దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్తో రూపొందుతోంది. రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీదేవోల్ చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా రామాయణ చిత్రం నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ‘రామా’ గ్లింప్స్ విడుదల తేదీని నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు.
ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా ఈ గ్లింప్స్ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు నమిత్ మల్హోత్రా తెలిపారు. గ్లింప్స్ విడుదలకు హనుమాన్ జయంతిని ఎంచుకోవడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సందర్భంగా అభిమానులకు ఒక గొప్ప విజువల్ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో మేకర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ‘రామాయణం ప్రతి ఒక్కరిది. ఈ కథను అత్యంత భక్తి, బాధ్యతతో నిజమైన రూపంలో తెరపైకి తీసుకురావడానికి మా టీమ్ కృషి చేస్తోంది. ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రామా గ్లింప్స్ను విడుదల చేసి ఈ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకోబోతున్నాం’ అని నిర్మాత చెప్పారు.
Also Read
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
- Jana Nayakudu: 'జన నాయకుడు' పోస్టర్తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్పై దండయాత్ర!
Also Read: Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్డే ట్రీట్ చరణ్ అన్న!
మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. అమెరికాలో తొలి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం. ఇందులో రణబీర్ కపూర్, నితేష్ తివారి, నమిత్ మల్హోత్రా పాల్గొని ప్రత్యేక గ్లింప్స్, కీలక అంశాలను మీడియాతో పంచుకునే అవకాశముంది. వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యమైన రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం.. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్గా నిలవనుంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు సవాల్..
-
Trump: ఇరాన్పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!