Prakash Raj: నీ ద్వేషం ఎవరిపై? ప్రకాష్ రాజ్’పై నటుడు సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు నాగ మహేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక అద్భుతమైన నటుడిగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి, తన మేధో వైకల్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని, సనాతన ధర్మాన్ని కించపరచడంపై నాగ మహేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్.. వెండితెరపై నవరసాలను పండించగల దిట్ట. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయన కేవలం ‘విద్వేషం’ అనే రసాన్ని మాత్రమే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన హిందూ ధర్మంపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంస్కార హీనతను బయటపెట్టాయని సహనటుడు నాగ మహేష్ ఎండగట్టారు. ప్రకాష్ రాజ్ అసలు ఎవరిని ద్వేషిస్తున్నారు? వ్యక్తులనా? రాజకీయ పార్టీలనా? లేక ఒక మతాన్నే లక్ష్యంగా చేసుకున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ అన్నా, బిజెపి అన్నా ఆయనకు ఉన్న వ్యతిరేకత వ్యక్తిగత ద్వేషంగా మారిపోయింది. నిత్యం “జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్ కళ్యాణ్ వంటి నేతలను ప్రశ్నించే ఆయన, ఆ ప్రశ్నల్లో తర్కం కంటే వెటకారాన్నే ఎక్కువగా నింపుతున్నారు.
Also Read:Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక, ఏకంగా దేవుళ్లనే హేళన చేసే స్థాయికి దిగజారడం విచారకరం. నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్, తన తల్లి నమ్మకాన్ని గౌరవిస్తూ చర్చిలో ప్రార్థనలు చేసినప్పుడు ఆయనను అందరూ సంస్కారవంతుడిగా చూశారు. కానీ, అదే వ్యక్తి కోట్లాది మంది హిందువుల నమ్మకమైన శ్రీరాముడిని అవహేళన చేసినప్పుడు ఆయనలోని ‘సంకుచిత బుద్ధి’ బయటపడింది. “నాస్తికత్వం అంటే దేవుడిని నమ్మకపోవడం.. కానీ ఒకరి నమ్మకాన్ని కించపరచడం కాదు. ప్రకాష్ రాజ్ చేస్తున్నది నాస్తికవాదం కాదు, అది అచ్చమైన హిందూ ద్వేషం.” రామాయణ గాథను ప్రకాష్ రాజ్ వక్రీకరించిన తీరు అత్యంత హేయంగా ఉంది. లక్ష్మణుడిని రాముడు ‘లక్కీ’ అని పిలుస్తాడంటూ ఆయన చేసిన వెకిలి వ్యాఖ్యలు విజ్ఞులైన ఎవరికైనా అసహ్యం కలిగిస్తాయి. రామలక్ష్మణులు రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని, దానికి శూర్పణఖ జీఎస్టీతో కలిపి బిల్లు వేసిందని ఆయన చెప్పిన కట్టుకథలు ఆయన ఉన్మాదానికి పరాకాష్ట. రాముడు ఉత్తరాది వాడని, రావణుడు దక్షిణాది వాడని లేనిపోని ప్రాంతీయ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఆయన కుటిల నీతికి నిదర్శనం. రామాయణాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రకాష్ రాజ్ కూడా తన వినాశనానికి తానే అంకురార్పణ చేసుకుంటున్నారని నాగ మహేష్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!