Prakash Raj: నీ ద్వేషం ఎవరిపై? ప్రకాష్ రాజ్’పై నటుడు సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు నాగ మహేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజ్ ప్రవర్తనపై సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఒక అద్భుతమైన నటుడిగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తి, తన మేధో వైకల్యంతో కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని, సనాతన ధర్మాన్ని కించపరచడంపై నాగ మహేష్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్.. వెండితెరపై నవరసాలను పండించగల దిట్ట. కానీ, నిజ జీవితంలో మాత్రం ఆయన కేవలం ‘విద్వేషం’ అనే రసాన్ని మాత్రమే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన హిందూ ధర్మంపై, రామాయణంపై చేసిన వ్యాఖ్యలు ఆయనలోని సంస్కార హీనతను బయటపెట్టాయని సహనటుడు నాగ మహేష్ ఎండగట్టారు. ప్రకాష్ రాజ్ అసలు ఎవరిని ద్వేషిస్తున్నారు? వ్యక్తులనా? రాజకీయ పార్టీలనా? లేక ఒక మతాన్నే లక్ష్యంగా చేసుకున్నారా? ప్రధాని నరేంద్ర మోదీ అన్నా, బిజెపి అన్నా ఆయనకు ఉన్న వ్యతిరేకత వ్యక్తిగత ద్వేషంగా మారిపోయింది. నిత్యం “జస్ట్ ఆస్కింగ్” అంటూ పవన్ కళ్యాణ్ వంటి నేతలను ప్రశ్నించే ఆయన, ఆ ప్రశ్నల్లో తర్కం కంటే వెటకారాన్నే ఎక్కువగా నింపుతున్నారు.
Also Read:Dhuarandhar 2 : ఒక్క అడుగు దూరంలో..ధురంధర్ 2
Also Read
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
- Mega 158: డాడీ కోసం పెద్ది!
సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న వారిని చూసి ఓర్వలేక, ఏకంగా దేవుళ్లనే హేళన చేసే స్థాయికి దిగజారడం విచారకరం. నాస్తికుడిగా చెప్పుకునే ప్రకాష్ రాజ్, తన తల్లి నమ్మకాన్ని గౌరవిస్తూ చర్చిలో ప్రార్థనలు చేసినప్పుడు ఆయనను అందరూ సంస్కారవంతుడిగా చూశారు. కానీ, అదే వ్యక్తి కోట్లాది మంది హిందువుల నమ్మకమైన శ్రీరాముడిని అవహేళన చేసినప్పుడు ఆయనలోని ‘సంకుచిత బుద్ధి’ బయటపడింది. “నాస్తికత్వం అంటే దేవుడిని నమ్మకపోవడం.. కానీ ఒకరి నమ్మకాన్ని కించపరచడం కాదు. ప్రకాష్ రాజ్ చేస్తున్నది నాస్తికవాదం కాదు, అది అచ్చమైన హిందూ ద్వేషం.” రామాయణ గాథను ప్రకాష్ రాజ్ వక్రీకరించిన తీరు అత్యంత హేయంగా ఉంది. లక్ష్మణుడిని రాముడు ‘లక్కీ’ అని పిలుస్తాడంటూ ఆయన చేసిన వెకిలి వ్యాఖ్యలు విజ్ఞులైన ఎవరికైనా అసహ్యం కలిగిస్తాయి. రామలక్ష్మణులు రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని, దానికి శూర్పణఖ జీఎస్టీతో కలిపి బిల్లు వేసిందని ఆయన చెప్పిన కట్టుకథలు ఆయన ఉన్మాదానికి పరాకాష్ట. రాముడు ఉత్తరాది వాడని, రావణుడు దక్షిణాది వాడని లేనిపోని ప్రాంతీయ చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం ఆయన కుటిల నీతికి నిదర్శనం. రామాయణాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ప్రకాష్ రాజ్ కూడా తన వినాశనానికి తానే అంకురార్పణ చేసుకుంటున్నారని నాగ మహేష్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!