ఇప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా ‘పాన్-ఇండియా’ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ కొత్త ఒరవడిని సృష్టించి, దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చెప్పాలంటే.. ఆయన ఓ బాక్సాఫీస్ రికార్డ్ బుక్. తాజాగా ‘ధురంధర్ 2’ సంచలన వసూళ్ల సాధిస్తున్న నేపథ్యంలో.. డార్లింగ్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పటి వరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రూ. 500 కోట్ల రూపాయల గ్రాస్, నెట్ వసూళ్లను సాధించిన అత్యధిక సినిమాలు ఉన్న కథానాయకుడిగా ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రభాస్ ఖాతాలో ఏకంగా నాలుగు చిత్రాలు 500 కోట్ల మార్కును దాటడం విశేషం.
Also Read:
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కంక్లూజన్’, ‘కల్కి 2898 AD’, ‘సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్’ ఈ లిస్ట్లో ఉన్నాయి. ఈ విజయాలతో దేశంలో మరే ఇతర హీరోకి సాధ్యం కాని రీతిలో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్లు ఉన్నారు. షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలు 500 కోట్ల క్లబ్లో చేరగా, రణవీర్ సింగ్ ఇటీవలి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘ధురంధర్’ చిత్రాలతో ఈ ఫీట్ సాధించారు. ఇక వెయ్యి కోట్ల సినిమాల పరంగా చూస్తే.. ప్రభాస్ రెండు, షారుఖ్ రెండు, రణ్వీర్ సింగ్కి రెండు చిత్రాలు ఉన్నాయి. అయినా కూడా ప్రభాస్ సాధించిన రికార్డుల ముందు వీరు వెనుకబడే ఉన్నారు. ఇక రాబోయే సినిమాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2లతో ప్రభాస్ సృష్టించబోయే రికార్డ్లను టచ్ చేయడం ఏ హీరోకైనా అంతా ఈజీగా ఉండదనే చెప్పాలి.