ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డే, ప్రస్తుతం సరైన హిట్ కోసం కష్టాలు పడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో ఆమెకు బ్యాడ్ లక్ వెంటాడుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Pawan Kalyan: ‘సూపర్ స్టార్ రజినీ’ టైటిల్ కార్డ్ కనిపిస్తే థియేటర్ మారుమోగుతుంది!
‘అల వైకుంఠపురములో’ తర్వాత పూజా నటించిన సినిమాలు వరుసగా నిరాశపరిచాయి. అఖిల్తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ప్రభాస్తో చేసిన ‘రాధే శ్యామ్’, విజయ్తో చేసిన ‘బీస్ట్’, రామ్ చరణ్తో చేసిన ‘ఆచార్య’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి.
తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా ఆమెకు కలిసి రాలేదు. ‘సర్కస్’ , దేవా, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాలు కూడా విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన పొందాయి. అంతేకాకుండా, తమిళ నటుడు సూర్యతో చేసిన ‘రెట్రో’ కూడా నిరాశనే మిగిల్చింది.
Also Read:SSMB 29 : మహేష్ ఫ్యాన్స్ అలర్ట్.. ఆఫ్రికాకు జక్కన్న అండ్ టీం!
ఇక తాజాగా, ఆమె స్పెషల్ సాంగ్ చేసిన ‘కూలీ’ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో ‘మోనికా’ పాటలో ఆమె డ్యాన్స్ అందరినీ మెప్పించినప్పటికీ, సినిమాలో ఆ పాట ప్లేస్మెంట్ సరిగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ వరుస పరాజయాలు పూజా హెగ్డే కెరీర్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తిరిగి ఫామ్లోకి రావడానికి ఆమెకు ఒక పెద్ద హిట్ ఎంత అవసరమో ఈ పరాజయాలు స్పష్టం చేస్తున్నాయి. ఆమె చేతిలో విజయ్ జన నాయగన్ సినిమా ఒక్కటే ఉంది. మరి భవిష్యత్తులో ఆమె లక్ ఎలా ఉంటుందో చూడాలి.