అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘””పోలీస్ వారి హెచ్చరిక “” !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. “నేను గతంలో బాబ్జీతో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల చేయలేకపోయాను. కానీ బాబ్జీ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కి వచ్చాను. ఈ సినిమా కంటెంట్ గురించి విన్నాను. ఆ కంటెంట్ విన్నాక ఈ సినిమాని కచ్చితంగా సపోర్ట్ చెయ్యాలి అనిపించింది. అంత బాగుంది. ఈ సినిమా కంటెంట్ పై నాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని తప్పకుండా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని అన్నారు.
తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..” సమాజంలో జరిగే చెడులను ప్రశ్నించే సినిమాలు రావాలి. ఈ సినిమా కూడా అలాంటి కోవకే చెందిన సినిమా. గతంలో ఎన్టీఆర్ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, మోహన్ బాబు గారు లాంటి నటులు ఎర్ర జెండాను పట్టుకొని కమ్యూనిస్ట్ అంశాలతో చక్కటి సందేశాత్మక చిత్రాలు తీశారు. ఆ సినిమాలను జనాలు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు బాబ్జీ అలాంటి ఆశయాలతో ఈ సినిమా చేశారు. విలువలతో కూడిన సందేశాత్మక సినిమాలను కచ్చితంగా మనం సపోర్ట్ చెయ్యాలి. ఇలాంటి సినిమాని అందిస్తున్నందుకు డైరెక్టర్ బాబ్జికి, నిర్మాత బెల్లి జనార్దన్ కి అభినందనలు తెలుపుతున్నాను ” అన్నారు …..!! జయసుధ మాట్లాడుతూ, ” బాబ్జి సినీ పరిశ్రమ లోకి వచ్చినప్పటి నుంచి నాకు బాగా పరిచయం . చాలా అద్భుతమైన డైరెక్టర్.. ఇప్పుడు వాళ్ళ అబ్బాయితో ఈ సినిమా తీశారు. సినిమా కంటెంట్ చాలా బాగుంది. ఈ సినిమా పాటలు విన్నాను. వినసొంపుగా చాలా బాగున్నాయి. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను. డైరెక్టర్ బాబ్జీ గారికి, నిర్మాత బెల్లి జనార్దన్ గారికి ఆల్ ది బెస్ట్ ” అని అన్నారు.