Site icon NTV Telugu

Ustad Bhagat Singh : హరీష్ శంకర్‌కు టార్గెట్ టెన్షన్

Harish Shankar

Harish Shankar

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అభిమానులు ప్రస్తుతం ‘ఓజీ’ (OG – ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా సాధించిన భారీ విజయంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ‘ఓజీ’ సినిమాతో పవన్ కల్యాణ్ కెరీర్‌లో మొదటిసారిగా ₹300 కోట్ల మార్క్‌ను దాటి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ అపారమైన విజయంతో పవన్ తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ దర్శకుడు హరీశ్ శంకర్‌కు ప్రస్తుతం పెద్ద సవాల్ ఎదురైంది.

Also Read :Venkatesh: త్రివిక్రమ్ మూవీ వాయిదా?

సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే, ఆ తర్వాత సినిమాపై మరింత శ్రద్ధ పెట్టి, అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫ్లాప్ అయితే, ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. కానీ, ‘ఓజీ’ సక్సెస్ తర్వాత పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ తీస్తున్న హరీశ్ శంకర్‌కు ఈ రెండు ఆప్షన్స్ లేవు. ఎందుకంటే, ‘ఓజీ’ విజయం ఆయనపై మరింత భారీ టార్గెట్‌ను సెట్ చేసింది. ‘ఓజీ’ ₹300 కోట్ల మార్క్‌ను దాటడంతో, ఇప్పుడు హరీశ్ శంకర్ తీయబోయే ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఆ కలెక్షన్లను మించగలదా? అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది.

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే అభిమానులకు ‘గబ్బర్‌సింగ్’ గుర్తుకొస్తుంది. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన ‘గబ్బర్‌సింగ్‌’ హిట్‌ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తుండటం అంచనాలను మరింత పెంచింది. అయితే, ఇప్పుడు టార్గెట్ కలెక్షన్ల పరంగానే కాకుండా, పాత్ర చిత్రీకరణ పరంగానూ భారీగా ఉంది. హరీశ్ శంకర్ తన తాజా చిత్రంలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ పాత్రను ‘గబ్బర్‌సింగ్’ కంటే ఎంత పవర్‌ఫుల్‌గా చూపిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read :Bhagyashri Borse : అందమా, లక్కా.. త్వరలో తేలనుంది!

హరీశ్ శంకర్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ అభిమానుల అంచనాలను అందుకునేందుకు పక్కా ప్లానింగ్‌తో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏప్రిల్‌లో థియేటర్స్‌లోకి రానున్నట్లు సమాచారం. ఒకవైపు ‘ఓజీ’ ఇచ్చిన ఉత్సాహం, మరోవైపు ₹300 కోట్ల మార్క్‌ను అధిగమించాలనే ఒత్తిడి మధ్య హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’తో ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

Exit mobile version