మళ్ళీ వార్తల్లోకి పవన్, త్రివిక్రమ్ ‘కోబలి’…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందాల్సిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘కోబలి’. రాయసీమ నేపథ్యంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కు గతంలోనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తెలియని కారణాలతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. 2013లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరువాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. తరువాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ చిత్రంతో బిజీ కాగా… పవన్ రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ వరుస సినిమాలు చేస్తుండడంతో త్రివిక్రమ్ ‘కోబలి’ని తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు త్రివిక్రమ్. మరోవైపు పవన్ కళ్యాణ్ బహుళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పవన్ ఇప్పుడు క్రిష్ ‘హరి హర వీరమల్లు’, అయ్యప్పనమ్ కోషియం తెలుగు రీమేక్ లతో పాటు మరో ఇద్దరు దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి త్రివిక్రమ్ ‘కోబలి’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Samantha Maa Inti Bangaram Review: సమంత మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
- Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
- Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
- Tags
- pawan kalyan
- Trivikram
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!