Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Partition 1947: చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి వెండితెరపై కనిపించబోతుండటంతో ‘పార్టిషన్ 1947’ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానుల భారీ రద్దీ మధ్య ఒక యువకుడికి గాయాలు కావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
సన్నీ డియోల్, ప్రీతి జింటా సినిమా ప్రమోషన్ కోసం లక్నోలోని కృష్ణ నగర్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్కు శుక్రవారం వెళ్లారు. తమ అభిమాన నటీనటులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఫొటోలు తీసుకుంటుండగా ఒక వ్యక్తి కాలికి గాయం కావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తొలుత సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రమాద తీవ్రతపై రకరకాల ప్రచారం జరిగింది.
Also Read
- DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
- Producer Naga Vamsi: నిర్మాతల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో చెప్పిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
- Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
- Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
అయితే లక్నో పోలీసులు దీనిపై వెంటనే స్పష్టత ఇచ్చారు. ఫీనిక్స్ మాల్లో ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వ్యక్తి కాలికి స్వల్ప గాయం మాత్రమే అయిందని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారని, ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా సాధారణంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే లక్నో పర్యటన సందర్భంగా సన్నీ డియోల్, ప్రీతి జింటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కూడా కలిశారు. నిన్న ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఇద్దరు నటులతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అనంతరం వారికి దేవుళ్లు, దేవతల విగ్రహాలను బహూకరించి ఫొటోలకు పోజులిచ్చారు.
సన్నీ డియోల్, ప్రీతి జింటా కాంబినేషన్కు కూడా ‘పార్టిషన్ 1947’ ప్రత్యేకమైనదే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి కలిసి తెరపై కనిపించనున్నారు. గతంలో 2018లో విడుదలైన ‘భయ్యాజీ సూపర్హిట్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సన్నీ, ప్రీతి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు ‘పార్టిషన్ 1947’తో ఈ హిట్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే బజ్ పెరిగింది. ఆగస్టు 14న ‘పార్టిషన్ 1947’ థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్ సమయంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత సన్నీ, ప్రీతి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మూవీని చూసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
- Tags
- cinema
- Partition 1947
తాజావార్తలు
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
-
Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
-
US LPG Supplier to India: భారత్కు 67% LPG అమెరికా నుంచే.. అతిపెద్ద సరఫరాదారుగా యూఎస్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!