బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్గా ఉండనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నా ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందట. అయితే తాజాగా భిమానులా ఎదురు చూపులకి పులిస్టాప్ పడింది.. అఫీషియల్గా ‘వార్ 2’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది.
Also Read: Phone: స్మార్ట్ఫోన్ వాడకుంటే.. పరిశోధనలో ఏం తేలింది తెలుసా !
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో సంచలనం సృష్టించబోతుంది అంటూ పోస్ట్లో రాసుకొచ్చారు. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరు పవర్ ఫుల్ హీరోస్ని ఒక్క తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్లో ఉంటుంది. ఈ పోస్ట్ చూడాగానే హృతిక్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్లు సరిపోవు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఇటీవల హృతిక్ రోషన్కు గాయం కావడంతో షూటింగ్కు బ్రేక్ పడిందని.. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు నెలకొనాయి. కానీ ఎట్టకేలకి క్లారిటీ వచ్చేసింది.